Jai Bheem : పాత్ర కోసం ఎలుక మాంసం కూడా తిన్నాను : జై భీమ్ సినతల్లి
ఇందులో నేను చేసింది గిరిజన స్త్రీ పాత్ర కాబట్టి గిరిజన తెగకు చెందిన మహిళలను కలుసుకుని వారితో కొన్ని రోజలు గడిపాను. వాళ్లు ఎలా ఉంటారు? ఏం తింటారు? అన్ని రీసెర్చ్ చేశాను.
Jai Bheem : సూర్య మెయిన్ లీడ్ లో వచ్చిన ‘జై భీమ్’ సినిమా ప్రేక్షకులని చాలా బాగా ఆకట్టుకుంది. విమర్శకుల నుంచి కూడా ప్రశంశలు సాధించింది. ఒక గిరిజన యువకుడి హత్య, జస్టిస్ చంద్రు జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని ఈసినిమాకి తెరకెక్కించారు. ఇందులో అందరూ డి గ్లామర్ రోల్స్ చేశారు. ఇందులో నటించిన అందరికి మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా సినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ జొస్ కి అందరి అభినందనలు దక్కుతున్నాయి.
Amitab : పాన్ మసాలా బ్రాండ్కు లీగల్ నోటీసులు పంపిన అమితాబ్
గతంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి కూడా ఈ సినిమాలో డి గ్లామర్ రోల్ చేయడానికి ఒప్పుకుంది. ఇలాంటి పాత్ర చేయాలంటే నిజంగా సాహసమనే చెప్పాలి. ఈ పాత్ర కోసం లిజోమోల్ ఎక్కువే కష్టపడింది. ఈ పాత్రలో నటించడానికి లిజోమోల్ జోస్ చాలా కష్టపడిందని ఇటివల ఓ తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.
Rakul Preet Singh : రకుల్ప్రీత్ బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్.. చెలరేగిన మంటలు..
‘జై భీమ్’ సినిమా కథను డైరెక్టర్ జ్ఞానవేల్ చెప్పగానే పాత్రలోని భావం అర్థమైంది. ఇదెంత కష్టమైన పాత్రో అర్ధం చేసుకొని దాని కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. ఇటువంటి పాత్ర కోసం ఎంతైనా కష్టపడాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం డైటింగ్ చేసి బరువు కూడా తగ్గాను. ఇందులో నేను చేసింది గిరిజన స్త్రీ పాత్ర కాబట్టి గిరిజన తెగకు చెందిన మహిళలను కలుసుకుని వారితో కొన్ని రోజలు గడిపాను. వాళ్లు ఎలా ఉంటారు? ఏం తింటారు? అన్ని రీసెర్చ్ చేశాను. అంతే కాకుండా వారితో కలిసి ఎలుకలు పట్టడానికి కూడా వెళ్లి, వాళ్ళు ఎలా పడుతున్నారో చూసి నేను కూడా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఒకసారి ఎలుక మాంసం కూడా తిన్నాను. ఇలా ఎన్ని చేసినా ఆ పాత్ర కోసమే చేశాను. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన ప్రశంశలు చూసి నేను పడ్డ కష్టం అంతా మర్చిపోయాను అని తెలిపింది లిజో మోల్ జోస్.