Maharashtra Deputy CM : అజిత్ పవార్కు ఐటీ షాక్..రూ.1000కోట్ల ఆస్తులు సీజ్
పన్ను ఎగవేత కేసుకు సంబంధించి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఐటీ షాక్ తగిలింది. అజిత్ పవార్కు చెందిన రూ. 1000 కోట్లు విలువ చేసే ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ మంగళవారం సీజ్
Maharashtra Deputy CM పన్ను ఎగవేత కేసుకు సంబంధించి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఐటీ షాక్ తగిలింది. అజిత్ పవార్కు చెందిన రూ. 1000 కోట్లు విలువ చేసే ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ మంగళవారం సీజ్ చేసింది.
ముంబైలోని నారిమన్ పాయింట్ లోని నిర్మల్ టవర్,ఓ షుగర్ ఫ్యాక్టరీ మరియు ఓ రిసార్ట్ సహా ఐదు ప్రాపర్టీలను ఐటీ శాఖ సీజ్ చేసింది. బినామీ నిరోధక చట్టాన్ని ప్రయోగించి ప్రాపర్టీలను సీజ్ చేసిన ఐటీ శాఖ..అజిత్ పవార్ మరియు అతని కుటుంబం ఈ బినామీ ఆస్తుల లబ్ధిదారులు అని పేర్కొంది. ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ 1000 కోట్లకు పైగా ఉంటుంది. ఈ ఆస్తులు ఏవీ అజిత్ పవార్ పేరుతో లేకపోవడం గమనార్హం.
కాగా, పన్ను ఎగవేత ఆరోపణలపై ఇటీవల అజిత్ పవార్ బంధువుల నివాసాలు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు జరిపింది. ముంబై, పుణె, సతారా సహా మహారాష్ట్ర, గోవాలోని మరికొన్ని నగరాల్లో ఐటీ దాడులు జరిగాయి. డీబీ రియాల్టీ, శివాలిక్, జరండేశ్వర్ సాఖర్ షుగర్ కార్ఖానా (జరండేశ్వర్ ఎస్ఎస్కే), పవార్ సోదరీమణుల వ్యాపార సముదాయాల్లో ఈ సోదాలు జరిగాయి. గత వారం అజిత్ పవార్ బంధువులకు చెందినవిగా భావిస్తున్న రెండు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్ధలపై ఐటీ అధికారులు చేపట్టిన దాడుల్లో రూ 184 కోట్ల లెక్కతేలని ఆదాయాన్ని గుర్తించారు.
ALSO READ Huzurabad by election : కారును వెనక్కి నెట్టేసి..10వ రౌండ్ లోను బీజేపీ ముందంజ