కరోనా రోగులకు చికిత్స చేయకుండానే రూ. 5.26 కోట్ల బిల్లు వేసిన ఆస్పత్రి..ఒక్క ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదు

కరోనా రోగులకు చికిత్స చేయకుండానే రూ. 5.26 కోట్ల బిల్లు వేసిన ఆస్పత్రి..ఒక్క ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదు

Pune hospital Rs.5.26 bill without treating covid Patient : కరోనా పేరుతో జనాల నుంచి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు ఎంత డబ్బు పిండేశాయో ఎన్నో సందర్భాల్లో విన్నాం. ఏదో పెద్ద చికిత్స చేసేసినట్లుగా లక్షల రూపాల బిల్లులు వేసి కరోనా కష్టకాలంలో జనాల బ్యాంకు బ్యాలెన్స్ లు ఖాళీ చేయించేశాయి. ఆస్తులు అమ్ముకుని మరీ బిల్లలు కట్టిన ఘటనలు లేకపోలేదు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని పూణెలో ఓ ఆసుపత్రి చేసిన నిర్వాకం బయటకు వచ్చి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.

కరోనా రోగులకు కనీసం ఒక్కటంటే ఒక్క ట్యాబ్లెట్ కూడా వేయకుండానే ఏకంగా కోట్ల కొద్దీ బిల్లులు వేసిన ఘటన షాకింగ్ కు గురించేస్తోంది. ఆ ఆస్పత్రిలో జాయిన్ అయిన కరోనా రోగులకు ఏమాత్రం చికిత్స చేయకుండానే చేసినట్టు బిల్డప్ ఇచ్చింది. కానీ..ట్రీట్ మెంట్ చేసినట్లుగా ఫేక్ బిల్లులు సృష్టించి..కోట్ల కొద్దీ బిల్లులు వేసింది.

పూణెలోని స్పర్శ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఏకంగా రూ. 5.26 కోట్ల బిల్లులు వేసి వాటిని అధికారులకు సమర్పించింది. దీంతో అవాక్కయిన అధికారులు విచారణ జరపటంతో షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. అసలా ఆసుపత్రి ఒక్క రోగికి కూడా చికిత్స చేయలేదని విచారణలో తేలింది. సదరు ఆసుపత్రికి రెండు కరోనా సెంటర్లు ఉండగా, ఒక్కదాంట్లో కూడా ఒక్క రోగికి కూడా చికిత్స అందించలేదని, ఒక్కటంటే ఒక్క ట్యాబ్లెట్ కూడా ఇచ్చిన పాపాన కూడా పోలేదని తెలిసి అధికారులు అవాక్కయ్యారు.

దీంతో ఈ బిల్లుల వెనకున్న గూడుపుఠాణీని తెలుసుకునేందుకు పింప్రి-చించ్వాడ్ మునిసిపాలిటీ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. కేసు దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం ఆ కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో సదరు ఆస్పత్రి నిర్వహిస్తున్న కరోనా సెంటర్లలో ఒక సెంటర్ లో ఒక్క కరోనా పేషెంట్ కు కూడా ట్రీట్ మెంట్ చేయలేదని నివేదికలో వెల్లడైంది.

దీంతో అధికారులు షాక్ అయ్యారు. కాగా..ఇప్పటికే సదరు ఆసుపత్రి సమర్పించిన రూ. 5.26 కోట్ల బిల్లులో అధికారులు ఇప్పటికే రూ.3.29 కోట్లు చెల్లించేశారు. మిగతా సొమ్ము చెల్లింపు మాత్రం దర్యాప్తులో తేలినదానిని బట్టి ఉంటుందని అధికారులు తెలిపారు.