IPL 2024 : ఆర్సీబీ దెబ్బకు పాయింట్ల పట్టికలో కిందకు వెళ్లిపోయిన మూడు జట్లు
ఐపీఎల్ 2024 సీజన్ లో ఇప్పటి వరకు 11 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ జట్టు.. కేవలం నాలుగు మ్యాచ్ లలోనే విజయం సాధించి ఎనిమిది పాయింట్లు సాధించింది.
Royal Challengers Bengaluru : ఐపీఎల్ 2024 లో 52వ మ్యాచ్ శనివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది వరుసగా మూడో విజయం. ఈ సీజన్ లో మొత్తం 11 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ జట్టు.. కేవలం నాలుగు మ్యాచ్ లలోనే విజయం సాధించి ఎనిమిది పాయింట్లు సాధించింది. గుజరాత్ తో మ్యాచ్ ముందు వరకు ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. గుజరాత్ జట్టు పై విజయంతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకొని ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
Also Read : IPL 2024 : అక్కడుంది కింగ్ కోహ్లీ.. అయినా పరుగు తీస్తావా..! ఫలితం ఇలానే ఉంటది మరి.. వీడియో వైరల్
గుజరాత్ జట్టుపై విజయంతో ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో మూడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంకు చేరుకుంది. ఈ జట్టు నాలుగు మ్యాచ్ లలో విజయంతో ఎనిమిది పాయింట్లు కలిగి ఉంది. -0.049 రన్ రేట్ తో ఉంది. బెంగళూరు తరువాత స్థానాల్లో పంజాబ్, గుజరాత్, ముంబై జట్లు ఉన్నాయి. పంజాబ్ జట్టు ఎనిమిది పాయింట్లు, -0.062 రన్ రేటు కలిగి ఉంది. ఆర్సీబీపై ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంకు పడిపోయింది. 11 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు ఎనిమిది పాయింట్లతో -1.320 రన్ రేటును కలిగి ఉంది.
Also Read : IPL 2024 : డుప్లెసిస్ వీరబాదుడు.. దడ పుట్టించిన బెంగళూరు.. గుజరాత్ విలవిల!
ఇక చివరి స్థానంలో ముంబై జట్టు ఉంది. ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆ జట్టు పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు.. మూడు మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది. ఆరు పాయింట్లు, -0.356 రన్ రేటుతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
RCB MOVES TO 7th IN THE IPL 2024 POINTS TABLE 🔥
WE ARE COMING ‼️ #RCBvsGT pic.twitter.com/Je2DF1KqpZ
— V I P E R (@VIPERoffl) May 4, 2024