Sarkaru Vaari Paata : థియేటర్లో మహేష్ ఫ్యాన్స్ హంగామా.. థియేటర్ యాజమాన్యంతో గొడవ..

మొదటి రోజు కావడంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు లోని M1 సినిమాస్ థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.......

Sarkaru Vaari Paata : థియేటర్లో మహేష్ ఫ్యాన్స్ హంగామా.. థియేటర్ యాజమాన్యంతో గొడవ..

Svp

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇవాళ (మే 12న) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాపై భారీ అంచానాలు ఉన్నాయి. ఇక ఉదయం ఆట నుంచే సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. మొదటి రోజు కావడంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు లోని M1 సినిమాస్ థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Ritika Nayak : చేసింది సెకండ్ హీరోయిన్‌గా ఒక్క సినిమా.. హీరోయిన్‌గా మూడు సినిమాల డీల్..

సర్కారు వారి పాట సినిమా చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ హంగామా చేశారు. కేరింతలు, అరుపులు, విజిల్స్ తో సందడి చేస్తున్నారు. దీంతో థియేటర్ యాజమాన్యం వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులు, థియటర్ యాజమాన్యం మధ్య గొడవ జరిగి కొట్లాటకు దారి తీసింది. ఈ విషయం తెలుసుకొని పోలీసులు రంగప్రవేశం చేసి వివాదాన్ని ఆపారు. హాలు యాజమాన్యం మహేష్ బాబు సినిమాను విజయవంతం కాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని మహేష్ అభిమానులు ఆరోపించారు.