Maheshbabu : ‘లవ్ స్టోరీ’తో మహేష్ బాబుకి లాభం

'లవ్ స్టోరీ' సినిమా ఒక్క మల్టిప్లెక్స్ లోనే కోటి రూపాయలు వసూలు చేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబుకి చెందిన ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్‌లో సెకండ్ వేవ్ తర్వాత కోటి రూపాయల గ్రాస్ వసూలు

Maheshbabu : ‘లవ్ స్టోరీ’తో మహేష్ బాబుకి లాభం

Mahesh

Maheshbabu :  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా భారీ విజయం సాధించింది. కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన సినిమాల్లో ‘లవ్ స్టోరీ’ పెద్ద హిట్ గా నిలిచింది. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయి దాదాపు నెల రోజులు అవుతున్నా ఇంకా థియేటర్స్ లో మంచి బుకింగ్స్ అవుతున్నాయి. ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని దాటేసింది. అయితే ఈ సినిమాతో మహేష్ బాబుకి కూడా బాగా లాభం చేకూరింది.

‘లవ్ స్టోరీ’ సినిమా ఒక్క మల్టిప్లెక్స్ లోనే కోటి రూపాయలు వసూలు చేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబుకి చెందిన ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్‌లో సెకండ్ వేవ్ తర్వాత కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసిన తొలి చిత్రంగా లవ్ స్టోరీ రికార్డు సాధించింది. ఇప్పటివరకు ‘లవ్ స్టోరీ’ సినిమా 251 షోలు పడగా దాదాపు 48 వేల మందికి పైగా ఈ సినిమాని ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్‌లో చూశారు. ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో కోటి రూపాయల వసూళ్లు సాధించిన చిత్రాలు చాలా తక్కువని అందులో ఇది ఒకటని నిర్వాహకులు తెలిపారు.

Nayanatara : పెళ్లి కాకముందే ప్రియుడితో కలిసి తీర్థయాత్రలు చేస్తున్న నయనతార

‘లవ్ స్టోరీ’ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 22 శుక్రవారం సాయంత్రం నుండి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.