Maniratnam : బాహుబలి లేకపోతే పొన్నియిన్ సెల్వన్ లేదు..

ప్రమోషన్స్ లో భాగంగా పొన్నియిన్ సెల్వన్ చిత్రయూనిట్ అంతా ఆదివారం నాడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. స్టార్స్ అంతా ప్రెస్ మీట్ లో మాట్లాడి అలరించారు. ఈ ప్రెస్ మీట్ లో మణిరత్నం మాట్లాడుతూ మరోసారి బాహుబలిని, రాజమౌళిని పొగిడారు.

Maniratnam : బాహుబలి లేకపోతే పొన్నియిన్ సెల్వన్ లేదు..

Maniratnam comments on Bahubali and Rajamouli

Maniratnam :  తమిళ్(Tamil) నుంచి గత సంవత్సరం మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) సినిమా రిలీజయింది. ఈ సినిమాని భారీగా పాన్ ఇండియా రిలీజ్ చేశారు. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభిత, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, జయరాం.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ తో తెరకెక్కింది ఈ సినిమా. అయితే పొన్నియిన్ సెల్వన్ తమిళ్ లో భారీ విజయం సాధించినప్పటికీ మిగిలిన చోట్ల మాత్రం పర్వాలేదనిపించింది. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 2 రాబోతుంది. ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది.

దీంతో చిత్రయూనిట్ మరోసారి భారీగా ఇండియా అంతా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా పొన్నియిన్ సెల్వన్ చిత్రయూనిట్ అంతా ఆదివారం నాడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. స్టార్స్ అంతా ప్రెస్ మీట్ లో మాట్లాడి అలరించారు. ఈ ప్రెస్ మీట్ లో మణిరత్నం మాట్లాడుతూ మరోసారి బాహుబలిని, రాజమౌళిని పొగిడారు.

Errabelli Dayakar Rao : మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా.. వరంగల్ లో ఫిలిం స్టూడియో పెట్టండి.. KCRతో నేను మాట్లాడతాను..

మణిరత్నం మాట్లాడుతూ.. నేను ఆల్రెడీ గతంలోనే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బాహుబలి లేకపోతే పొన్నియిన్ సెల్వన్ లేదు. రాజమౌళి బాహుబలిని 2 పార్టులుగా తీయకపోతే పొన్నియిన్ సెల్వన్ సినిమా వచ్చేది కాదు. ఇదే విషయాన్ని నేను రాజమౌళిని కలిసి కూడా చెప్పాను. రాజమౌళి బాటలోనే మేము వెళ్తున్నాము. రాజమౌళి భారీ మార్కెట్ కు, మన కథలు చెప్పడానికి తలుపులు తెరిచారు. ఆయన అలా చేయడం వల్లే మేము ఇప్పుడు ముందుకు వచ్చాము. మేము కూడా రెండు పార్టులుగా సినిమా చేయగలిగాము అని అన్నారు.