Eetala Rajender: ఈటలపై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ఘాటు లేఖ!

తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ పై ఘాటు లేఖ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీమంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను ఖండించిన తెలంగాణ మావోయిస్టు పార్టీ... తాజాగా మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేసింది.

Eetala Rajender: ఈటలపై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ఘాటు లేఖ!

Eetala

Eetala Rajender: తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ పై ఘాటు లేఖ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీమంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను ఖండించిన తెలంగాణ మావోయిస్టు పార్టీ… తాజాగా మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేసింది. ఈటల రాజేందర్ తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ కెసిఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని చెప్పారని.. ఆ ప్రకటన చేసిన అనంతరం ఆయన హిందుత్య పార్టీ అయిన బీజేపీలో ఎలా చేరారని మావోయిస్టు పార్టీ ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ కు.. ఈటెల రాజేందర్ కు మధ్య జరుగుతున్న ఘర్షణ తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం కాదన్నారు. వారు ఇద్దరూ ఒకే గూటి పక్షులని పేర్కొన్న తెలంగాణ మావోయిస్టు పార్టీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగా కేసీఆర్, ఈటెలకే పదవులు దక్కాయని.. ఈ ఇద్దరూ అందలం ఎక్కగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడిచారని విమర్శించారు. వీరి పాలన ప్రజా వ్యతిరేకమైనది కాగా.. సామ్రాజ్యవాద దళారి నిరంకుశ పెట్టుబడిదారీ విధానానికి, భూస్వామ్య వర్గాలకు అనుకూలంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల పునర్నిర్మాణం మార్చారని ఆరోపించారు.

మొన్నటి వరకు కేసీఆర్ పక్కన అధికారాన్ని అనుభవించిన ఈటల తన ఆస్తుల పెంపుదలకు ప్రయత్నించారని.. అందులో భాగంగా పేదల భూములను అక్రమంగా ఆక్రమించారని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఆరోపించారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తానని ప్రకటిస్తూ ఈటల తన ఆస్తుల రక్షణ కోసం నేడు బిజెపిలో చేరారన్నారు. ఆర్ఎస్యు మావోయిస్టులు కూడా తనకు మద్దతు ఇస్తారని ఈటల చెప్పుకోవడం పచ్చి మోసంగా మా పార్టీ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తుందని జగన్ లేఖలో పేర్కొన్నారు.

ఈటల తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణలోని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారని.. బీజేపీ హిందూత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా దేశంలో విశాల ప్రజలు ఐక్యమై పోరాడుతున్నారు. అలాగే కేసీఆర్ నియంత పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడుతున్నారని.. పార్టీలు మారినా ప్రజల పోరాటం ఒక్కటేనన్నారు.