chhattisgarh: పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోల మృతి
ఛత్తీస్గఢ్లో మరోసారి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
chhattisgarh: ఛత్తీస్గఢ్లో మరోసారి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్ పాల్, కుండమేర్ మధ్య ఉండే అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన అనంతరం ఘటనాస్థలి నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
presidential election 2022: శివాలయంలో చీపురుతో ఊడ్చిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
ఈ విషయాన్ని జిల్లా ఎఎస్పీ పంకజ్ శుక్లా ధ్రువీకరించారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం సీఆర్పీఎఫ్ జవాన్లపై నక్సల్స్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. బోడెన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సహజ్ పానీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.