Maruthi : ప్రజారాజ్యం పార్టీకోసం పనిచేశాను.. డైరెక్టర్ గా ఫస్ట్ యాక్షన్ చెప్పింది చిరంజీవి గారికే..

మారుతి మాట్లాడుతూ.. ''చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి ఫ్యాన్ ని. చిరంజీవి సినిమాలకి తీసుకెళ్లకపోతే ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. నాకు టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చిరంజీవి గారు, నేను.....

Maruthi : ప్రజారాజ్యం పార్టీకోసం పనిచేశాను.. డైరెక్టర్ గా ఫస్ట్ యాక్షన్ చెప్పింది చిరంజీవి గారికే..

Maruthi

Chiranjeevi :  గోపీచంద్, రాశిఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమా జూలై 1న థియేటర్స్ లోకి రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరగగా ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో దర్శకుడు మారుతి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు.

మారుతి మాట్లాడుతూ.. ”చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి ఫ్యాన్ ని. చిరంజీవి సినిమాలకి తీసుకెళ్లకపోతే ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. నాకు టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చిరంజీవి గారు, నేను మెట్ల మీద నుంచి నడుస్తూ, మాట్లాడుతున్నట్టు కల వచ్చింది. ఆ కలని గుర్తుపెట్టుకొని ఎప్పటికైనా జరగాలి అనుకునేవాడిని. నేను గ్రాఫిక్ డిజైనర్ గా కెరీర్ మొదట్లో ఉన్నప్పుడు అప్పుడే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పనుల్లో ఉన్నారు. ఆయన లోగో, పార్టీకి సంబంధించిన వాటి కొన్ని డిజైన్స్ కోసం మంచి గ్రాఫిక్ డిజైనర్ కోసం చూస్తుంటే అల్లు బాబీ నన్ను తీసుకెళ్లారు. ఆ రోజు ఇప్పటికే మర్చిపోలేను. ఆ రోజు మెట్ల మీద నుంచి నడుస్తూ చిరంజీవి గారు ఆ వర్క్ గురించి నాకు చెప్పారు. నా కల నెరవేరిన రోజు అది.”

Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..

”ఆ తర్వాత ప్రజారాజ్యం కి యాడ్స్ కూడా నేనే చేశాను. అప్పుడు నాకు ఇంకా డైరెక్టర్ అవుదామని ఆలోచన కూడా లేదు. అప్పుడు ఫస్ట్ టైం చిరంజీవి గారికి యాక్షన్ చెప్పాను. నా జన్మ ధన్యమైపోయింది. అప్పుడు ఆయనే నాలోని డైరెక్టర్ గుర్తించి డైరెక్టర్ అవ్వమన్నారు. ఇవ్వాళ మీ ముందు ఇలా నిల్చున్నాను అంటే కేవలం చిరంజీవి గారి వల్లే” అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు మారుతి.