Babu Mohan : పాన్‌లో విషం కలిపి చంపడానికి ప్రయత్నించారు.. రాజకీయాలు అంత ప్రమాదం..

బాబు మోహన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''ఢిల్లీలో శ్రీకాంత్ 'వన్స్‌మోర్‌' సినిమా షూటింగ్‌ చేస్తున్నాం. ఆ సమయంలో సెట్స్‌లో తనికెళ్ల భరణి పాన్‌ తింటున్నాడు. నన్ను కూడా తినమని..........

Babu Mohan : పాన్‌లో విషం కలిపి చంపడానికి ప్రయత్నించారు.. రాజకీయాలు అంత ప్రమాదం..

Babu Mohan

Babu Mohan :   ప్రముఖ కమెడియన్, రాజకీయ నాయకుడు బాబు మోహన్ ఎన్నో సినిమాల్లో తన కామెడీతో అలరించారు. ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ రాజకీయాల్లో తన సేవలు అందిస్తున్నారు. సినిమాలకి దూరమైనా సినీ పరిశ్రమతో అంతే సన్నిహితంగా మెలుగుతూ అప్పుడప్పుడు పలు సినీ ఈవెంట్లు, షోలలో పాల్గొంటున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోతనని చంపడానికి ప్రయత్నించారని బాబూమోహన్ ఓ షాకింగ్ సంఘటన తెలిపారు.

బాబు మోహన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”ఢిల్లీలో శ్రీకాంత్ ‘వన్స్‌మోర్‌’ సినిమా షూటింగ్‌ చేస్తున్నాం. ఆ సమయంలో సెట్స్‌లో తనికెళ్ల భరణి పాన్‌ తింటున్నాడు. నన్ను కూడా తినమని నాకు కూడా పాన్ అలవాటు చేశాడు. ఆ తర్వాత ఒకానొక టైంలో రోజుకు 30 నుంచి 40 దాకా పాన్‌లు తిన్నాను. సంగారెడ్డిలో ఓ పాన్ డబ్బాలో పాన్ బాగుంటుంది. దీంతో సంగారెడ్డికి వెళ్లిన ప్రతిసారి అక్కడి నుంచి పాన్ తెప్పించుకొని తినేవాడిని.”

Sumanth : విలన్ క్యారెక్టర్స్ చేయడానికి నేను రెడీ.. ఓటీటీలకు కూడా సిద్ధం..

”రాజకీయాల్లో విరోధులు ఉంటారని తెలిసిందే. నేను అక్కడ పాన్‌ కచ్చితంగా తింటానని తెలిసిన కొందరు ఓసారి పాన్ లో విషాన్ని కలిపారు. నేను ఆ డబ్బా దగ్గరకు వెళ్లి పాన్‌ తీసుకుని కారులో వెళ్ళేటప్పుడు తిందామనుకునే సమయానికి ఎవరో ఫోన్ చేసి దయచేసి పాన్‌ తినకండి, అందులో విషం ఉందని చెప్పారు. నేను వెంటనే పాన్‌ పక్కన పడేశాను. ఆ తర్వాత ఆ పాన్‌ కట్టే వ్యక్తి భార్య కాల్ చేసి.. తప్పయిపోయింది సార్‌, విషం కలిపిన పాన్‌ ఇవ్వమని మమ్మల్ని ఒత్తిడి చేశారు, లేకపోతే చంపేస్తాం అన్నారు అని ఏడ్చింది. రాజకీయాలు ఇంత ప్రమాదమా అని అప్పుడు తెలిసింది. ఇలాంటివి సినిమాల్లోనే అనుకున్నా నిజ జీవితంలో కూడా జరుగుతాయా అని తెలిసింది” అని తన లైఫ్ లో జరిగిన ఈ చేదు సంఘటనని తెలిపారు.