Satellite Based Internet: భారత్లో మరో ఇంటర్నెట్.. జియోకి పోటీ ఇస్తుందా?
భారతదేశంలో ఇంటర్నెట్ అంతకుముందు చాలా ఖరీదైనదిగా ఉండేది.
Satellite Based Internet In India: భారతదేశంలో ఇంటర్నెట్ అంతకుముందు చాలా ఖరీదైనదిగా ఉండేది. కానీ 5 సెప్టెంబర్ 2016 తర్వాత, ప్రతిదీ మారిపోయింది. రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశించి ఇంటర్నెట్ డేటా పాయింట్ల ధరలను బాగా తగ్గించేసింది. ఇతర కంపెనీలు కూడా జియో దెబ్బకు తమ ప్లాన్లను చౌకగా చేయాల్సి వచ్చింది. ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినందున చాలా తక్కువ ధరకు ఎక్కువ డేటాను అందించడం సాధ్యమైంది.
రిలయన్స్ జియో చౌకైన డేటా ప్లాన్ల కారణంగా అనేక చిన్న టెలికాం కంపెనీలు మూసివేయబడ్డాయి. కొన్ని విలీనం అవ్వగా.. ప్రస్తుతం మార్కెట్లో జియో మరియు ఎయిర్టెల్ మధ్య మాత్రమే పోటీ నెలకొని ఉంది. అయితే, ఇప్పుడు ఇంటర్నెట్ రంగంలోకి సేవలందించేందుకు ప్రపంచ కుబేరులుగా పేరొందిన జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్ ముందుకు వచ్చారని తెలుస్తోంది. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ కనెక్టివిటీని ఇండియన్స్కు అందుబాటులోకి తెచ్చేందుకు వారు ఇద్దరు వేర్వేరు ప్లాన్లతో కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు చేసింది.
హైస్పీడ్ బ్రాడ్బాండ్తోపాటు ఇంటర్నెట్ స్పేస్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రంగాల్లో భారత్ టెలికం, బ్రాడ్బాండ్ రంగంలో సునీల్ మిట్టల్ సారధ్యంలోని ఎయిర్టెల్, ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలో జియో సేవలందిస్తుంది. టెలికంశాఖ, అంతరిక్ష పరిశోధన శాఖలతో ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ వెంచర్ స్టార్ లింక్, అమెజాన్ ప్రతినిధులు సంప్రదింపులు జరిపారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే వారు ఫార్మల్ రూట్లో లైసెన్స్ కోసం ఇంకా దరఖాస్తు చేయలేదని తెలుస్తుంది.
శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, దీని ద్వారా ఇంటర్నెట్ అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, పర్వతాలు, అడవులు, ఎడారులు లేదా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ను ఉపయోగించడం సులభం అవుతుంది. మస్క్ తన స్టార్లింక్ ప్రాజెక్ట్ను భారతదేశానికి తీసుకురావడానికి చాలా సంతోషిస్తున్నానని బహిరంగంగా చెప్పాడు. ట్విట్టర్లో, మస్క్ ఒక వినియోగదారుకు సమాధానంగా తాను ప్రస్తుతం రెగ్యులేటరీ ఆమోదం ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పాడు.