Naresh-Pavitra : హోటల్‌లో నరేశ్, పవిత్రా.. చెప్పుతో కొట్టడానికొచ్చిన నరేష్ మూడో భార్య..

ఏ సంబంధం లేదు అంటూనే నరేశ్, పవిత్రా తిరిగేస్తున్నారు. తాజగా నరేశ్, పవిత్రా మైసూరులోని ఓ హోటల్ కి వెళ్లగా అక్కడికి నరేశ్ మూడో భార్య వచ్చి గొడవ చేసింది. నరేశ్, పవిత్రా కలిసి వెళ్తుండగా రమ్య.........

Naresh-Pavitra : హోటల్‌లో నరేశ్, పవిత్రా.. చెప్పుతో కొట్టడానికొచ్చిన నరేష్ మూడో భార్య..

Naresh

Naresh-Pavitra :  గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, సీనియర్ నటి పవిత్రా లోకేష్ పేర్లు వార్తల్లో బాగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్టు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే నరేశ్ మూడు పెళ్లిళ్లు చేసుకోగా అవి బ్రేకప్ అవ్వగా ఇప్పుడు నాలుగో పెళ్ళికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వ్యాఖ్యలు వీరిద్దరూ ఖండించారు.

ఏ సంబంధం లేదు అంటూనే నరేశ్, పవిత్రా తిరిగేస్తున్నారు. తాజగా నరేశ్, పవిత్రా మైసూరులోని ఓ హోటల్ కి వెళ్లగా అక్కడికి నరేశ్ మూడో భార్య వచ్చి గొడవ చేసింది. నరేశ్, పవిత్రా కలిసి వెళ్తుండగా రమ్య పవిత్రా లోకేష్ ని చెప్పుతో కొట్టబోయింది. పోలీసులు రమ్యని అడ్డుకోవడంతో వారిద్దరూ వెళ్లిపోయారు. నరేశ్ రమ్య వైపు చూసి విజిల్స్ వేస్తూ వెళ్లారు. నరేశ్ మూడో భార్య రమ్యపై కూడా పలు ఆరోపణలు రాగా గతంలోనే తనకి, నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసాడు.

Rashmi Gautam : పచ్చందనమే పచ్చదనమే..తొలి తొలి వలపే పచ్చదనమే..

ఈ సందర్భంగా నరేశ్ మరోసారి రమ్యపై ఆరోపణలు చేశారు. రమ్య రాకేష్ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, వారిద్దరూ కలిసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. అయితే నరేశ్, పవిత్ర సంబంధం గురించి మాత్రం ఏం మాట్లాడలేదు. వీరిద్దరూ మైసూర్ కి ఎందుకు వెళ్లారు? ఒకే హోటల్ కి ఎందుకు వెళ్లారు అని పలు అనుమానాలు తలెత్తుతుండటంతో వీరి బంధంపై మరిన్ని వార్తలు వస్తున్నాయి.