NTR 30: తారక్ జోడీగా నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో మరో క్రేజీ ఆఫర్!

టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్, తారక్ క్రేజ్ స్థాయిని సినీ విశ్లేషకులు కూడా అంచనా వేయలేనంతగా పెరిగి పోతుందని టాక్ నడుస్తుంది.

NTR 30: తారక్ జోడీగా నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో మరో క్రేజీ ఆఫర్!

Ntr 30

NTR 30: టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్, తారక్ క్రేజ్ స్థాయిని సినీ విశ్లేషకులు కూడా అంచనా వేయలేనంతగా పెరిగి పోతుందని టాక్ నడుస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటనతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారేజ్ కాంబోలో మరో సినిమా అంటూ తారక్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది చాలా కాలంగా అభిమానులకు ఉత్కంఠ రేపుతున్న సంగతి తెలిసిందే.

Ala Vaikunthapurramuloo: పుష్ప ఇచ్చిన జోష్.. హిందీలో బన్నీ సినిమా!

ముందుగా ఈ క్రేజీ కాంబినేషన్ కోసం బాలీవుడ్ భామలు జాన్వీ కపూర్, కియారా అద్వానీ పేర్లు వినిపించగా ఈ మధ్య జనతా గ్యారేజ్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ సమంతాను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు కథనాలొచ్చాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నను ఎంచుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్ మొదలైంది. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరగగా కాల్షీట్స్ కన్ఫర్మ్ చేసినట్లు చెప్తున్నారు.

RGV : అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కొత్త మెగాస్టార్ అంటూ..

రష్మిక ప్రస్తుతం తెలుగులో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక తమిళంలో విజయ్ సరసన మరో సినిమా చేస్తుండగా హిందీలో ఆమె సినిమాలు చివరి దశకి వచ్చేశాయి. కొరటాల-తారక్ సినిమా మొదలయ్యే సమయంలో రష్మిక హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు ఆ సినిమాలు చివరి దశకి చేరడంతో ఎన్టీఆర్ సినిమాకి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. పైగా ఇప్పుడు పుష్ప సక్సెస్ తో రష్మిక ఫాలోయింగ్ మరింత పెరగడంతో పాన్ ఇండియా సినిమాకి ఆమె బెస్ట్ ఛాయిస్ గా మారినట్లు తెలుస్తుంది.