ఇక నెక్ట్స్ మేమే వస్తాం.. టీడీపీపై నాగబాబు ట్వీట్ ఫైర్

  • Published By: srihari ,Published On : May 30, 2020 / 08:35 AM IST
ఇక నెక్ట్స్ మేమే వస్తాం.. టీడీపీపై నాగబాబు ట్వీట్ ఫైర్

టీడీపీపై మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. భవిష్యత్ లో వైసీపీ అధికారంలోకి వస్తుందో.. జేఎస్‌పీ వస్తుందో, బీజేపీ వస్తుందో కాలమే నిర్ణయించాలని ట్వీట్ చేశారు. కానీ, టీడీపీ మళ్లీ అధికారంలోకి రాదని తన నమ్మకమని నాగబాబు అన్నారు. ఎందుకంటే తమ హయాంలో ప్రజలకు టీడీపీ చేసేందేమీ లేదని చెప్పారు. టీవీల్లో, పేపర్లలో తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదని నాగబాబు ట్వీట్ లో పేర్కొన్నారు. అందుకే ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాలని చెప్పారు.

ఇక నెక్స్ట్ మేమే వస్తామని జోస్యం చేప్పారు. మాదే రాజ్యలాంటి కలల్లోంచి టీడీపీ నేతలు బయటపడాలన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు యూట్యూబ్ చానెల్లో మండిపడ్డారు. భూములు పంచుకుంటున్నారా అన్న బాలయ్య వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదని హితవు పలికారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని నాగబాబు సూచించారు. బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీకి టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.