Nikhil Siddhartha : నిఖిల్‌కి ఐకానిక్ గోల్డ్ అవార్డ్.. ‘నేషనల్ లెవెల్ బిగ్ స్టార్’ అంటున్న బాలీవుడ్ మీడియా..

గత ఏడాది నిఖిల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'కార్తికేయ-2'. కేవలం 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 121 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో నిఖిల్ కి నార్త్ లో మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఈ సినిమాకి నిఖిల్ నార్త్ లో అవార్డ్ కూడా అందుకున్నాడు. ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా ప్రింట్ చేస్తూ..

Nikhil Siddhartha : నిఖిల్‌కి ఐకానిక్ గోల్డ్ అవార్డ్.. ‘నేషనల్ లెవెల్ బిగ్ స్టార్’ అంటున్న బాలీవుడ్ మీడియా..

Nikhil Siddhartha won iconic gold best actor award for karthikeya 2

Nikhil Siddhartha : గత ఏడాది నిఖిల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కార్తికేయ-2’. 2014లో వచ్చిన కార్తికేయ సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ రెండు సినిమాలకు చందు ముండేటినే దర్శకత్వం వహించాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యి కాసుల వర్షం కురిపించింది. కేవలం 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 121 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో నిఖిల్ కి నార్త్ లో మంచి గుర్తింపు లభించింది.

Nikhil Siddhartha : నా లైఫ్‌లో ఆ క్యారెక్టర్స్‌ని నేను ఎప్పటికి మర్చిపోలేను.. నిఖిల్!

తాజాగా ఈ సినిమాకి నిఖిల్ నార్త్ లో అవార్డ్ కూడా అందుకున్నాడు. బాలీవుడ్ లో ఇచ్చే ప్రముఖ ‘ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్’ ఇటీవల ముంబైలో గ్రాండ్ గా జరిగాయి. 2022 గాను కార్తికేయ సినిమాకి పాపులర్ ఛాయస్ కేటగిరీలో బెస్ట్ యాక్టర్ గా నిఖిల్ కి అవార్డుని అందించారు. ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా ప్రింట్ చేస్తూ.. ‘నేషనల్ లెవెల్ బిగ్ స్టార్ నిఖిల్’ అంటూ రాసుకొచ్చారు. హ్యాపీ డేస్ సినిమాలో వన్ అఫ్ ది యాక్టర్ గా పరిచయమైన నిఖిల్.. నేడు బాలీవుడ్ మీడియాతో పొగిడించుకునే స్థాయికి ఎదిగాడు. అది కూడా బాలీవుడ్ లో తన డెబ్యూట్ తోనే కావడంతో టాలీవుడ్ ఆడియన్స్ నిఖిల్ ని అభినందిస్తున్నారు.

కాగా నిఖిల్ ప్రస్తుతం ‘స్పై’ అనే యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు, హిట్-1,2 సినిమాలకు ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ‘గర్రి బిహెచ్’ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో నిఖిల్ కి జోడిగా తమిళ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నటిస్తుంది. శ్రీచరణ్ పకల సంగీతం అందిస్తున్నాడు. ఈడి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కె రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ అండ్ పోస్టర్ ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.