Maharashtra: ఉద్ధ‌వ్ ఠాక్రేకు క‌రోనా.. అసెంబ్లీని ర‌ద్దుచేసే ప్రతిపాదన లేదన్నారు: క‌మ‌ల్‌నాథ్‌

 మ‌హారాష్ట్రలో రాజ‌కీయ ప‌రిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అక్క‌డి ప‌రిస్థితుల‌పై చ‌ర్చించ‌డానికి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌మ‌ల్‌నాథ్ ముంబైకి వెళ్లిన విష‌యం తెలిసిందే.

Maharashtra: ఉద్ధ‌వ్ ఠాక్రేకు క‌రోనా.. అసెంబ్లీని ర‌ద్దుచేసే ప్రతిపాదన లేదన్నారు: క‌మ‌ల్‌నాథ్‌

Kamalnath

Maharashtra: మ‌హారాష్ట్రలో రాజ‌కీయ ప‌రిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అక్క‌డి ప‌రిస్థితుల‌పై చ‌ర్చించ‌డానికి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌మ‌ల్‌నాథ్ ముంబైకి వెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే, ఉద్ధ‌వ్ ఠాక్రేకు క‌రోనా సోకింద‌ని, ఆయ‌న‌ను తాను క‌ల‌వ‌లేద‌ని క‌మ‌ల్‌నాథ్ మీడియాకు తెలిపారు. ఉద్ధ‌వ్ ఠాక్రేతో ఫోనులో మాట్లాడాన‌ని, ఇప్ప‌టివ‌ర‌కు మ‌హారాష్ట్ర అసెంబ్లీని ర‌ద్దు చేసే ప్ర‌తిపాద‌న లేద‌ని చెప్పార‌ని వివ‌రించారు. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భగత్ సింగ్ కోశ్యారీకి కూడా క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.

Maharashtra: మా ప్ర‌భుత్వం ప‌త‌నం అంచున ఉన్నా మేము పోరాడుతూనే ఉంటాం: సంజ‌య్ రౌత్

కాగా, మహారాష్ట్ర కేబినెట్ స‌మావేశం ప్రారంభ‌మైంది. ఉద్ధ‌వ్ ఠాక్రే వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఈ స‌మావేశంలో మాట్లాడుతున్నారని సీఎంవో తెలిపింది. అసెంబ్లీని ర‌ద్దు చేసే అంశంపై ఈ సమావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు, ప్ర‌భుత్వం కుప్ప‌కూలిపోతుంద‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో శివ‌సేన కార్య‌క‌ర్త‌లు బాధ‌ప‌డిపోతున్నారు. ఔరంగాబాద్‌లో శివ‌సేన మ‌హిళా కార్య‌క‌ర్త‌లు మీడియాతో మాట్లాడుతూ క‌న్నీరు పెట్టుకున్నారు.