Maharashtra: మా ప్ర‌భుత్వం ప‌త‌నం అంచున ఉన్నా మేము పోరాడుతూనే ఉంటాం: సంజ‌య్ రౌత్

మ‌హారాష్ట్ర మంత్రి, శివ‌సేన సీనియ‌ర్ నేత ఏక్‌నాథ్ షిండేతో అసోంలోని గువాహ‌టిలో ఉన్న ఎమ్మెల్యేల‌తో తాము సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత సంజ‌య్ రౌత్ అన్నారు.

Maharashtra: మా ప్ర‌భుత్వం ప‌త‌నం అంచున ఉన్నా మేము పోరాడుతూనే ఉంటాం: సంజ‌య్ రౌత్

Hanuman Chalisa Row Sanjay Raut Alleges D Gang Link To Rana Couple (1)

Maharashtra: మ‌హారాష్ట్ర మంత్రి, శివ‌సేన సీనియ‌ర్ నేత ఏక్‌నాథ్ షిండేతో అసోంలోని గువాహ‌టిలో ఉన్న ఎమ్మెల్యేల‌తో తాము సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత సంజ‌య్ రౌత్ అన్నారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేల‌తో గోటానగర్ ప్రాంతంలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఏక్‌నాథ్ షిండే ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ‌ మధ్యాహ్నం ఒంటి గంటకు మహారాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది.

presidential election 2022: శివాలయంలో చీపురుతో ఊడ్చిన ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము

ఈ నేప‌థ్యంలో సంజ‌య్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ”ఏక్‌నాథ్ షిండేతో ఉన్న ఎమ్మెల్యేల‌తో మేము మాట్లాడుతున్నాం. ఆ ఎమ్మెల్యేలు అంద‌రూ శివ‌సేన‌లోనే ఉంటారు. మాది పోరాట ప‌టిమ ఉన్న పార్టీ. మేము పోరాడుతూనే ఉంటాం. మా ప్ర‌భుత్వం ప‌త‌నం అంచున ఉన్న‌ప్ప‌టికీ మేము పోరాడుతూనే ఉంటాం” అని సంజ‌య్ రౌత్ చెప్పారు. కాగా, ఇప్ప‌టికే ఏక్‌నాథ్ షిండేకు మద్దతు తెలుపుతూ పత్రాలపై శివసేనకు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కాగా, బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తోన్న శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి చర్చలు జరుపుతోంది.