Jr NTR: తారక్ తో పరుశురాం మల్టీస్టారర్.. రెండో హీరో ఎవరు?

ఆర్ఆర్ఆర్ విడుదల కాకుండానే ఎన్టీఆర్ టాప్ దర్శకులతో సినిమాల లైనప్ సెట్ చేసుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్ కావడం ఖాయమనే అభిప్రాయముండగా..

Jr NTR: తారక్ తో పరుశురాం మల్టీస్టారర్.. రెండో హీరో ఎవరు?

Jr Ntr

Jr NTR: ఆర్ఆర్ఆర్ విడుదల కాకుండానే ఎన్టీఆర్ టాప్ దర్శకులతో సినిమాల లైనప్ సెట్ చేసుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్ కావడం ఖాయమనే అభిప్రాయముండగా ఈలోగా తారక్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం కొరటాలతో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లిన తారక్ తర్వాత బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్ సినిమాలతో పాటు బాలీవుడ్, కోలీవుడ్ దర్శకులతో కూడా సినిమాలను చేయనున్నాడు.

Story Based Movies: రూటు మార్చి కాన్సెప్ట్ తో కొడుతున్న చిన్న హీరోలు!

కాగా.. ఇప్పుడు ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడని ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు పరుశురాం పెట్లా ప్రస్తుతం మహేష్ బాబుతో సర్కారు వారి పాట తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా సమ్మర్ లో విడుదలకి సిద్దమవుతుంది. పరుశురాం ఈ సినిమా తర్వాత అక్కినేని నాగ చైతన్యతో ఓ సినిమా చేయాల్సి ఉంది. చైతూ, పరుశురాం ఇద్దరూ ఈ సినిమా ఉంటుందని ప్రకటించి ఉన్నారు.

Film Directors: బీవీఎస్ రవి-హరీష్ శంకర్ ట్విట్టర్ వార్.. అసలేం జరిగింది?

అయితే, పరుశురాం ఇప్పుడు ఎన్టీఆర్ తో కథా చర్చలు జరపడం.. దానికి ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు ఓ ప్రచారం మొదలైంది. ఇదొక పవర్ ఫుల్ మల్టీస్టారర్ కథని తెలుస్తుండగా.. సర్కారు వారి పాట తర్వాత ఈ సినిమానే మొదలు పెట్టనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇది ఎంతవరకు నిజమన్నది తెలియదు కానీ.. మల్టీస్టారర్ కథ కావడంతో ఈ సినిమాలో నటించే మరో హీరో ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.