UP Polls : యూపీలో మోదీ సుడిగాలి పర్యటనలు

ప్రారంభోత్సవాలు...శంకుస్థాపనలతో యూపీని చుట్టేస్తున్నారు. షాజహాన్‌పుర్‌లో గంగా ఎక్స్‌ప్రేస్‌వేకు శంకుస్థాపన చేయనున్నారు.

UP Polls : యూపీలో మోదీ సుడిగాలి పర్యటనలు

Pm Modi (2)

PM Modi Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం హోరెత్తుతోంది. అన్ని పార్టీలు ప్రచార జోరు పెంచాయి. అటు ప్రధాని మోదీ విస్తృత పర్యటనలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ….2021, డిసెంబర్ 18వ తేదీ శనివారం నుంచి సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఈనెల 28 మధ్య నాలుగుసార్లు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ. ఎన్నికలు జరగడానికి మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో… ప్రారంభోత్సవాలు…శంకుస్థాపనలతో యూపీని చుట్టేస్తున్నారు. షాజహాన్‌పుర్‌లో గంగా ఎక్స్‌ప్రేస్‌వేకు శంకుస్థాపన చేయనున్నారు.

Read More : Reservoir on Mars: అంగారక గ్రహంపై భారీ రిజర్వాయర్‌..45 వేల చదరపు కి.మీటర్ల పొడవైన జలాశయం

594 కిలోమీటర్ల ఈ ఎక్స్​ప్రెస్​వే కోసం 36 వేల 200 కోట్లు వెచ్చించనున్నారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌​ విమానాల అత్యవసర ల్యాండింగ్​, టేకాఫ్​ కోసం మూడున్నర కిలోమీటర్ల పొడవైన ఎయిర్​స్ట్రిప్​ను.. ఈ ఎక్స్​ప్రెస్​వేలో నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించారు.. కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌తో పాటు అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు.. అయితే ఈ పర్యటనలు ఇప్పట్లో ముగిసేలా లేవు..మరో మూడు సార్లు యూపీలో సుడిగాలి పర్యటన చేయనున్నారు ప్రధాని మోదీ.. రానున్న 10 రోజుల్లో మొత్తం నాలుగు సార్లు వేర్వేరు చోట్ల వివిధ కార్యక్రమాలకు హాజరుకానున్నారు మోదీ. డిసెంబర్‌ 21న ప్రయాగ్‌ రాజ్‌లో 2 లక్షల మంది మహిళా ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవ్వనున్నారు..

Read More : TS Inter : ఇంటర్ మీడియట్, ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మళ్లీ పరీక్షలు

డిసెంబర్‌ 23న వారణాసిలో మరోసారి పర్యటిస్తారు.. ఆ తర్వాత ఈ నెల 28న కాన్పూర్‌లో పర్యటించి మెట్రోను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాదిలో యూపీలో ఎన్నికలు జరుగనున్నాయి.. దేశ రాజకీయాలను సమూలంగా మార్చేసి.. కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి రావాలని నిర్దేశించే సత్తా గల అతి పెద్ద రాష్ట్రం యూపీ.. గత ఎన్నికల్లో 403 స్థానాలకు గాను 309 స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ.. ఈ సారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలలో ఉంది కాషాయదళం.. ఇప్పటికే ఈ రాష్ట్రానికి భారీగా నిధులను గుమ్మరిస్తున్న కేంద్రం. పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ప్రారంభించింది.. అదే సమయంలో ప్రధాని మోదీ పర్యటనలు.. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించాలనుకుంటున్నారు.. ఇందులో భాగంగానే వరుస పర్యటనలు చేస్తున్నారు..