PM Modi : కేదర్ నాథ్కు మోదీ…దీపావళి రోజు…800 కిలోల పూలతో అలంకరణ
రత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేదర్ నాథ్ లో ఆయన పర్యటించనున్నారు. ఆదిశంకరాచార్యుడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.
PM Modi To Visit Kedarnath : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన పూర్తి చేసుకుని ఢిల్లీలో అడుగు పెట్టారు. అనంతరం వివిధ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. ఈ క్రమంలో..కేదర్ నాథ్ లో ఆయన పర్యటించనున్నారు. 2021, నవంబ్ 05వ తేదీన ఆదిశంకరాచార్యుడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో చార్ ధామ్ దేవస్థానం బోర్డు సన్నాహాలు చేస్తోంది. కేదర్ నాథుడికి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం వివిధ కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు.
Read More : Telangana RTC : సార్..మా ఊరికి బస్సు వేయించండి…చీఫ్ జస్టిస్కు విద్యార్థిని ఉత్తరం
2013 ఉత్తరాఖండ్ వరదల విధ్వంసం అనంతరం ఆదిశంకరాచార్య విగ్రహాన్ని పునర్ నిర్మించారు. ఇప్పటికే పూర్తయిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ఘాట్లు, సరస్వతి రిటెయినింగ్ వాల్ ఆస్థపథ్, మందాకిని రిటెయినింగ్ వాల్ ఆస్థపథ్, తీర్థ్ పురోహిత్ ఇళ్లు, మందాకిని నదిపైన గల గరుడ్ చట్టి బ్రిడ్జ్ లను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే సభలో మోదీ ప్రసంగించనున్నారు.
Read More : ఒకే నంబర్ ప్లేట్ తో 2 బస్సులు _ Two Buses with Same Number Plate In Telangana
మరోవైపు..దీపావళి పండుగ సందర్భంగా…కేదరినాథ్ ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. దీపాలు, విద్యుత్ దీపాలతో ధగధగలాడుతోంది. కేదర్ నాథ్ ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. దాదాపు…800 కిలోల పూలతో ఆలయాన్ని అలంకరిచండం విశేషం. మంచుకొండల నడుమ…పూలతో అలంకరించిన ఈ ఆలయాకి భక్తులు పోటెత్తుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.