Five States Elections : మహిళల ఖాతాల్లోకి రూ.వెయ్యి కోట్లు బదిలీ చేసిన మోదీ

ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలోనే ప్రధాని మోదీ మహిళలకు వరాల జల్లు కురిపించారు. మహిళల ఖాతాల్లో రూ.1,000 కోట్లు జమచేశారు.

Five States Elections : మహిళల ఖాతాల్లోకి రూ.వెయ్యి కోట్లు బదిలీ చేసిన మోదీ

Five States Elections

Five States Elections : వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలు ప్రజలపై పథకాల జల్లు కురిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ హామీలు గుపిస్తున్నాయి. ఇక బీజేపీ ఉత్తరప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది. దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం కావడంతో.. దీనిపై బీజేపీ ఫుల్ ఫోకస్ చేసింది. ప్రస్తుతం రాష్ట్రాన్ని బీజేపీనే పాలిస్తుంది.
చదవండి : PM Modi : పటేల్ జీవించి ఉంటే..గోవాకు ముందుగానే విముక్తి

వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని చూస్తుంది. అఖిలేష్ నుంచి గట్టి పోటీ ఉండటంతో తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రజాకర్షణ కలిగిన నేతలతో ప్రచారం చేయిస్తుంది. ఇక మోదీ యూపీపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లుగా తెలుస్తోంది. 10 రోజుల వ్యవధిలో మోదీ యూపీలో నాలుగు సార్లు పర్యటించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి చెబుతున్నారు మోదీ. ఇక ఈ నేపథ్యంలోనే ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు.

చదవండి : PM Modi: గోవాకు ప్రధాని మోదీ

మంగళవారం నాడు యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాల ఖాతాలకు రూ.వెయ్యి కోట్లను ప్రధాని మోదీ బదిలీ చేశారు. ప్రయాగ్ రాజ్ పవిత్ర గంగా, యుమన, సరస్వతి నదుల సంగమ స్థలి అని మోదీ ప్రస్తుతించారు. వేలాది సంవత్సరాల మన మాతృ శక్తికి ప్రతీకగా దానిని మోదీ అభివర్ణించారు. నేడు ఈ పవిత్ర పట్టణం మహిళలు, వారి శక్తికి ప్రతీకగా నిలుస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సుమారు 1.6 లక్షల మహిళా సంఘాల ఖాతాలకు వెయ్యి కోట్ల రూపాయలను బదిలీ చేయడాన్ని గర్వకారణంగా మోదీ పేర్కొన్నారు.

చదవండి : Pm Modi: యూపీలో వరుస పర్యటనలు.. సమయం లేదు మిత్రమా!

ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. కొంత కాలం క్రితం వరకు కనీసం బ్యాంకు ఖాతాలు కూడా లేని మహిళలు ఈరోజు డిజిటల్ బ్యాంకింగ్ శక్తిని అందిపుచ్చుకుంటున్నట్టు చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో అభివృద్ధిలో ముందుచడంలో కృషి చేస్తామని తెలిపారు ప్రధాని మోదీ. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. వారణాసి కాశీ విశ్వనాథ్ కారిడార్ గురించి ప్రజలకు తెలియచేశారు.