JR NTR: చంద్రబాబు టూర్‌లో జూనియర్ ఎన్టీఆర్ జెండాలు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ టీడీపీ కార్యకర్తలతో పాటు నందమూరి కుటుంబ అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరిక.

JR NTR: చంద్రబాబు టూర్‌లో జూనియర్ ఎన్టీఆర్ జెండాలు..

Jr Ntr Babu

POLITICAL DISCUSSION OVER JR NTR IN CBN TOUR IN ANDHRA PRADESH: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ టీడీపీ కార్యకర్తలతో పాటు నందమూరి కుటుంబ అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరిక. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. కొందరి అభిమానుల మద్య వార్ సాగుతూ ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఎన్టీఆర్ రంగంలోకి దిగబోతున్నట్లు ప్రచారం సాగుతుంది. ఇటీవలికాలంలో తెలుగుదేశం కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అక్కడ దర్శనం ఇస్తున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చంద్రబాబు టూర్‌లో దర్శనం ఇచ్చాయి. పండుగలప్పుడు అయితే, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఎన్టీఆర్, తెలుగుదేశం ఫ్లెక్సీల్లో కచ్చితంగా కనిపిస్తున్నారు.

లేటెస్ట్‌గా మచిలీపట్నం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లతో స్వాగతం పలికారు పలువురు కార్యకర్తలు. చంద్రబాబు మచిలీపట్నం పర్యటనలో హాట్‌టాపిక్‌గా మారాయి జూనియర్ ఎన్టీఆర్ జెండాలు. జూనియర్ ఎన్టీఆర్ జెండాలు, ఫ్లెక్సీలే ఎక్కువగా కనిపించాయి.

మచిలీపట్నంలో చంద్రబాబుకి స్వాగతం పలికిన పార్టీ నేతలు, కార్యకర్తలు. బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ సంధర్భంగా బైక్ ర్యాలీలో కూడా జూనియర్ ఫోటో ఉండే జెండాలు కనిపించాయి. పర్యటనలో భాగంగా చంద్రబాబు మాజీ మంత్రి నడికుదిటి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

నరసింహారావుతో పాటు ఇటీవల కరోనాతో చనిపోయిన పార్టీ నేతలకు నివాళులు అర్పించిన చంద్రబాబు.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొల్లు రవీంద్ర మామ మంత్రి నడికుదిటి నరసింహారావు అనారోగ్యంతో ఇటీవలే చనిపోయారు.