Dil Raju : మళ్ళీ దిల్ రాజు వర్సెస్ టాలీవుడ్.. థియేటర్స్ గొడవ.. శివరాత్రికి కూడా థియేటర్స్ బ్లాక్??

తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో బన్నీ వాసు మాట్లాడుతూ దిల్ రాజుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఈవెంట్ లో బన్నీ వాసు మాట్లాడుతూ..................

Dil Raju : మళ్ళీ దిల్ రాజు వర్సెస్ టాలీవుడ్.. థియేటర్స్ గొడవ.. శివరాత్రికి కూడా థియేటర్స్ బ్లాక్??

Producer Bunny Vas comments on Dil Raju regarding Theaters

Dil Raju :  ఇటీవల సంక్రాంతికి థియేటర్ల ఇష్యూ వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉండగా తమిళ డబ్బింగ్ సినిమా వారసుడుని కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తూ థియేటర్స్ బ్లాక్ చేయడంతో దిల్ రాజు పై టాలీవుడ్, చిరు, బాలయ్య అభిమానులు సీరియస్ అయ్యారు. ముందు ససేమీరా అన్నా ఆ తర్వాత కొంచెం వెనక్కి తగ్గి తన వారసుడు సినిమాని మూడు రోజులు వాయిదా వేసుకున్నాడు. అయినా అప్పటికి కూడా రిలీజ్ ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ థియేటర్స్ కావాలంటూ థియేటర్స్ బ్లాక్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

దీంతో ఈ థియేటర్స్ ఇష్యూ వల్ల గత కొన్ని రోజులుగా దిల్ రాజు వర్సెస్ టాలీవుడ్ అన్నట్టు నడిచింది. నిన్నే ప్రెస్ మీట్ పెట్టి నా సినిమాని వాయిదా వేస్తున్నాను అని చెప్పాడో లేదో మళ్ళీ దిల్ రాజుపై నేడు మరో నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సారి కూడా థియేటర్స్ ఇష్యూనే కావడం గమనార్హం.

తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో బన్నీ వాసు మాట్లాడుతూ దిల్ రాజుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఈవెంట్ లో బన్నీ వాసు మాట్లాడుతూ.. చిన్న సినిమాలకి, చిన్న హీరోలకి రిలీజ్ డేట్ చాలా ఇంపార్టెంట్. కొన్ని పండగలకి చిన్న సినిమాలకి కూడా అవకాశం ఇవ్వాలి. కరోనా తర్వాత సినిమా మారిపోయింది. ఇండస్ట్రీలో ఇంతమంది పెద్దలున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్క త్రీ హాలిడేస్ చిన్న సినిమాలకి వదిలేస్తే మంచిది. కొత్త టాలెంట్ వస్తుంది ఇండస్ట్రీకి, ఎంకరేజ్ చేయండి. ఇప్పటికే శివరాత్రికి ఫిబ్రవరి 17 రోజు ధనుష్ సర్ సినిమా, విశ్వక్ ధమ్కీ సినిమా ఉన్నాయి. మా సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. మేము రిలీజ్ డేట్స్ ఎప్పుడో అనౌన్స్ చేశాం. ఆల్రెడీ ధనుష్ సినిమా రిలీజ్ చేసే హారిక హాసిని సంస్థ, విశ్వక్ సేన్ తో మాట్లాడి థియేటర్స్ సమస్య రాకుండా చూసుకున్నాము.

RRR For Oscars : దయచేసి ‘ఆర్‌ఆర్ఆర్’ని ఆస్కార్స్‌కి గుర్తించండి.. హాలీవుడ్ నిర్మాత!

ఇప్పుడు దిల్ రాజు సడెన్ గా శాకుంతలం సినిమాని కూడా ఫిబ్రవరి 17న అనౌన్స్ చేశారు. శాకుంతలం డేట్ ని సడెన్ గా అనౌన్స్ చేసి బాంబ్ పేల్చారు. నేను థియేటర్స్ విషయంలో దిల్ రాజుకు కాల్ చేశాను, మాట్లాడదాం అన్నారు. దిల్ రాజు పెద్ద మనసుతో అర్ధం చేసుకుంటారు అని అనుకుంటున్నాను అన్నారు. దీంతో టాలీవుడ్ లో మరోసారి థియేటర్స్ విషయంలో దిల్ రాజు వర్సెస్ టాలీవుడ్ నడుస్తుంది. ఇప్పటికే 3 సినిమాలు శివరాత్రికి అనౌన్స్ చేసినా దిల్ రాజు తన శాకుంతలం సినిమాని ఇటీవలే అదే రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం గమనార్హం. ఇలాగే కొనసాగితే శివరాత్రికి కూడా థియేటర్స్ క్లాష్ తప్పేలా లేదు.