Bigg Boss 5 : దిమ్మ దిరిగే ప్రశ్న అడిగిన ప్రేక్షకుడు.. షాక్ అయిన కాజల్

బిగ్ బాస్ చూసే ప్రేక్షకులతో కంటెస్టెంట్స్ ని ప్రశ్నలు అడిగించాడు. ఆ ప్రశ్నలకు ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా ఆన్సర్ చెప్తారో వాళ్ళు ప్రేక్షకులని ఓట్లు అడిగేందుకు సెలెక్ట్ అవుతారు అని....

Bigg Boss 5 : దిమ్మ దిరిగే ప్రశ్న అడిగిన ప్రేక్షకుడు.. షాక్ అయిన కాజల్

Kajal

Bigg Boss 5 :  బిగ్ బాస్ చివరి దశకి రావడంతో రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఒక పక్క ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే మరో పక్క గొడవలు పెట్టుకుంటున్నారు కంటెస్టెంట్స్. నిన్నటి ఎపిసోడ్ లో ప్రేక్షకులని ఓట్లు అడిగేందుకు కంటెస్టెంట్స్ కి ఓ టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులతో కంటెస్టెంట్స్ ని ప్రశ్నలు అడిగించాడు. ఆ ప్రశ్నలకు ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా ఆన్సర్ చెప్తారో వాళ్ళు ప్రేక్షకులని ఓట్లు అడిగేందుకు సెలెక్ట్ అవుతారు అని చెప్పాడు బిగ్ బాస్. దీనికి కంటెస్టెంట్స్ అంతా ఓకే చెప్పారు. అయితే ఈ ప్రశ్నల్లో భాగంగా కాజల్ ని ఓ ప్రేక్షకుడు అడిగిన ప్రశకి ఖంగు తింది.

Shriya : సినిమా చూడటానికి ఆటోలో వచ్చిన శ్రియ

మొదట్లో షణ్ముఖ్‌తో క్లోజ్ గా ఉన్నారు. తర్వాత రవితో, ఇప్పుడు సన్నీ, మానస్‌తో ఫ్రెండ్‌లా క్లోజ్ గా ఉంటున్నారు. మీకంటూ ఒక స్టాండ్ లేదా? మీరు కేవలం ఆటలో ముందుకు వెళ్లడానికి వాళ్ళని వాడుకుంటున్నారా? వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నట్టు ఉంటున్నారా? అని అడిగాడు. ఈ ప్రశ్నతో కాజల్ ఆశ్చర్యపోయింది. కాసేపటికి తేరుకొని తనకి తోచిన సమాధానం చెప్పింది.

Samantha : ‘పుష్ప’ ఐటెం సాంగ్‌లో సమంత అదరగొట్టే స్టిల్స్

కాజల్‌ ఈ ప్రశ్నకి సమాధానం చెప్తూ.. నాకు మొదట్లో షణ్ను నచ్చాడు, కనెక్ట్‌ అయ్యాను. కానీ కొన్ని సంభాషణల వల్ల మా మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత రవితో కనెక్ట్‌ అయ్యాను కానీ అది అంత క్లోజ్ ఏమి కాదు. ఆ తర్వాత మానస్‌, సన్నీలతో కనెక్ట్‌ అయ్యాను కానీ ఆట కోసం అయితే ఈ కనెక్షన్స్‌ పెట్టుకోలేదు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా కాబట్టే వాళ్లకి గేమ్ లో హెల్ప్ చేస్తున్నాను, నాకు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అని తెలిపింది.