Rashmika Mandanna: బాలీవుడ్ లో బిజీ అవుతున్న రష్మిక.. జెండా పాతేస్తుందా..

సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక ఇప్పుడు సౌత్ కన్నా బాలీవుడ్ మీదే ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేసినట్టు తెలుస్తోంది. పుష్ప సినిమాతో నేషనల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది. ఇప్పటికే సౌత్ లో.....

Rashmika Mandanna: బాలీవుడ్ లో బిజీ అవుతున్న రష్మిక.. జెండా పాతేస్తుందా..

Rashmika

Rashmika Mandanna :  కన్నడ హీరోయిన్ రష్మిక నెమ్మదిగా తెలుగులో కూడా బిజీ అయిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ లో జెండా ఎగరేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు సౌత్ లో చేస్తున్న సినిమాల కంటే ఎక్కువగా బాలీవుడ్ లో సినిమాలతో ఈమధ్య కాలంలో ఏ సౌత్ హీరోయిన్ కీ లేనంత క్రేజ్ సంపాదించుకుంటోంది. లేటెస్ట్ గా కరణ్ జోహార్ అనౌన్స్ చేసిన సినిమాలో టైగర్ ష్రాఫ్ కి హీరోయిన్ గా రష్మిక నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.

సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక ఇప్పుడు సౌత్ కన్నా బాలీవుడ్ మీదే ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేసినట్టు తెలుస్తోంది. పుష్ప సినిమాతో నేషనల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది. ఇప్పటికే సౌత్ లో పుష్ప 2, వారసుడు, సీతా రామం సినిమాలు చేస్తుంది. మరిన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి. ఇక బాలీవుడ్ లో మిషన్ మజ్ను, గుడ్ బై , యానిమల్ సినిమాలు చేస్తున్న రష్మిక తాజాగా మరో భారీ ప్రాజెక్టు దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Allu Arjun : ఐకాన్ స్టార్ ఒక్క ఫొటోతో.. ‘పుష్ప’పై ఎన్నో అనుమానాలు..

బాలీవుడ్ రష్మిక ని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటోంది. అందుకే వరస పెట్టి సినిమాలతో ముంచెత్తుతోంది. బాలీవుడ్ లో ఇప్పటి వరకూ చేసిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లు అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. లేటెస్ట్ గా టైగర్ ష్రాఫ్, కరణ్ జోహార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్క్రూ ఢీలా సినిమాలో హీరోయిన్ గా రష్మిక మరోఛాన్స్ దక్కించుకుంది. శశాంక్ కేతన్ డైరెక్షన్లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న స్క్రూ ఢీలా సినిమాలో రష్మిక టైగర్ కి జంటగా నటిస్తోంది. ఇంతకుముందే వీళ్లిద్దరూ కలిసి యాడ్ షూట్ కూడా చేశారు. ఇలా వరుస సినిమాలతో బాలీవుడ్ లో జెండా పాతేయడానికి ఫిక్స్ అయిపోయింది రష్మిక. ఇక ఇటీవల బాలీవుడ్ లో ప్రతి ఈవెంట్ లోను, ప్రతి ఫంక్షన్ లోనూ అక్కడి స్టైల్ లో బట్టలు వేసుకెళ్లి హడావిడి చేస్తుండటంతో బాలీవుడ్ మీద మరింత ఫోకస్ పెడుతుంది రష్మిక.