Jasprit Bumrah: భారత టెస్టు జట్టు కెప్టెన్గా ఫాస్ట్ బౌలర్కి 35 ఏళ్ళ తర్వాత తొలిసారి ఛాన్స్..
భారత్-ఇంగ్లండ్ మధ్య జూలై 1 నుంచి జరగనున్న ఐదో టెస్టు నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ వైదొలిగాడు. ఆయనకు కరోనా సోకడంతో ఈ టెస్టులో ఆడడం లేదు. దీంతో కెప్టెన్ బాధ్యతలు ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా నిర్వర్తించనున్నాడు.
Jasprit Bumrah: భారత్-ఇంగ్లండ్ మధ్య జూలై 1 నుంచి జరగనున్న ఐదో టెస్టు నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ వైదొలిగాడు. ఆయనకు కరోనా సోకడంతో ఈ టెస్టులో ఆడడం లేదు. దీంతో కెప్టెన్ బాధ్యతలు ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా నిర్వర్తించనున్నాడు. దాదాపు 35 ఏళ్ళ తర్వాత ఓ ఫాస్ట్ బౌలర్ టెస్టు జట్టుకు సారథ్య బాధ్యతలు దక్కడం ఇదే తొలిసారి. 35 ఏళ్ళ క్రితం ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్ టీమిండియా సారథి బాధ్యతల్లో కొనసాగారు. 1987 నుంచి ఆయన సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
Maharashtra: రేపు బలపరీక్ష.. నేడు కీలక నిర్ణయాలు తీసుకున్న మహారాష్ట్ర కేబినెట్
అప్పటి నుంచి ఇప్పటి వరకు టెస్టు జట్టుకి ఏ ఫాస్ట్ బౌలర్ కూడా సారథిగా లేడు. భారత టెస్టు జట్టుకి సారథిగా ఇప్పటి వరకు మొత్తం 35 మంది బాధ్యతలు నిర్వర్తించారు. ఈ జాబితాలో 36వ క్రికెటర్గా బుమ్రా నిలుస్తున్నాడు. ఇప్పటివరకు 29 టెస్టులు ఆడిన బుమ్రా మొత్తం 123 వికెట్లు తీశాడు. ప్రపంచ ఉత్తమ ఫాస్ట్ బౌలర్గా కొనసాగుతున్నాడు.
Maharashtra: రేపు బలపరీక్ష.. మీ తీరు సరికాదు: సీఎం ఉద్ధవ్కు గవర్నర్ లేఖ
రోహిత్ శర్మ ఐదో టెస్టు మ్యాచు నుంచి వైదొలగడంతో ఓపెనర్ గా శుభ్మన్ గిల్తో పాటు ఛటేశ్వర్ పుజారా లేదా హనుమ విహారి క్రీజులోకి వచ్చే అవకాశం ఉంది. రీషెడ్యూల్లో భాగంగా ఐదో టెస్టును జూలై 1 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ టెస్టు మ్యాచు జూలై 5న ముగియనుంది. అనంతరం ఇంగ్లండ్తో జూలై 7న తొలి టీ20 ప్రారంభం కానుంది. కాగా, రోహిత్ శర్మ ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టునే ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.