Roja : ఏపీ సినిమా టికెట్ వ్యవహారంపై వ్యాఖ్యలు చేసిన రోజా

రోజా మాట్లాడుతూ.. ‘‘పేద ప్రజల కోసమే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జగన్‌ లాంటి మంచి ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూసి ఉండం. చిరంజీవి, నాగార్జున, ఇతర సినీ పెద్దలు.......

Roja : ఏపీ సినిమా టికెట్ వ్యవహారంపై వ్యాఖ్యలు చేసిన రోజా

Roja

Roja :   ఏపీలో, తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా టికెట్‌ ధరల వ్యవహారం, థియేటర్ల మూసివేత ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. సినీ పరిశ్రమకి, సినిమాని నమ్ముకొని జీవించే వాళ్లకి ఈ నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తున్నాయని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై చాలా మంది సినీ ప్రముఖులు స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని సినీ పరిశ్రమ నుంచి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్తున్నాయి.

Shraddha Das : గోవాలో ఛిల్ అవుతున్న శ్రద్ధా

తాజాగా ఈ విషయంపై సినీ నటి, వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా ఈ వ్యవహారంపై స్పందించారు. రోజా మాట్లాడుతూ.. ‘‘పేద ప్రజల కోసమే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జగన్‌ లాంటి మంచి ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూసి ఉండం. చిరంజీవి, నాగార్జున, ఇతర సినీ పెద్దలు ఆన్‌లైన్‌ టికెటింగ్‌ పెట్టాలని ఎన్నోసార్లు కోరడం వల్లే జగన్‌ అంగీకరించారు. సినిమా వాళ్లతో చర్చలు జరిపి, వాళ్ల అభ్యర్థన మేరకే జగన్ చేశారు. కానీ ఇప్పుడు కొంతమంది రాజకీయ లబ్ధి కోసం దీన్ని సమస్యగా మారుస్తున్నారని నా అభిప్రాయం. ఇది తెలుసుకుని మిగిలిన సినీ ప్రముఖులు ఇప్పుడిప్పుడే చర్చలకు వస్తున్నారు. కాబట్టి త్వరలోనే ఈ విషయంపై మంచి నిర్ణయం వస్తుందని భావిస్తున్నాను’’ అని తెలిపింది.