Sai Kumar : నటుడిగా 50 ఏళ్ళు.. పోలీస్ స్టోరీ మరో సీక్వెల్ త్వరలో..
తాజాగా సాయి కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ''ఈ అక్టోబర్కు నటుడిగా నాకు 50 ఏళ్లు నిండుతాయి. 1972లో మొదటి సారి నా 11వ ఏట దుర్యోధనుడి పాత్ర ద్వారా నాటక రంగంలో ప్రవేశించాను. 50 ఏళ్ళ తర్వాత ఇప్పుడు..........
Sai Kumar : యాక్షన్ హీరో సాయి కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన చేసిన ఎన్నో యాక్షన్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా పోలీస్ స్టోరీ సినిమా భారీ విజయం సాధించి సాయికుమార్ ని స్టార్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమాకి పోలీస్ స్టోరీ 2 అంటూ సీక్వెల్ కూడా తీశారు. అది కూడా మంచి విజయం సాధించింది. సాయి కుమార్ నటుడిగా 50 ఏళ్ళు పూర్తి అవుతున్న తరుణంలో పోలీస్ స్టోరీ 3 తీస్తానని ప్రకటించారు.
తాజాగా సాయి కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ”ఈ అక్టోబర్కు నటుడిగా నాకు 50 ఏళ్లు నిండుతాయి. 1972లో మొదటి సారి నా 11వ ఏట దుర్యోధనుడి పాత్ర ద్వారా నాటక రంగంలో ప్రవేశించాను. 50 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఒక సినిమాలో అనుకోకుండా మళ్ళీ అదే పాత్రలో నటిస్తున్నాను. ఈ 50 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలి అనుకుంటున్నాను. నాకు ‘పోలీస్ స్టోరీ’ సినిమా ఎంతో గుర్తింపు ఇచ్చింది. కమల్ హాసన్ ‘విక్రమ్’ సాధించిన విజయం చూసిన తర్వాత మళ్లీ ‘పోలీస్ స్టోరీ’ సినిమాకు సీక్వెల్ తీయాలి అనుకున్నాను. పోలీస్ స్టోరీ మూడో భాగం వివరాలని త్వరలోనే ప్రకటిస్తాను” అని తెలిపారు.