Samantha : చాలా రోజుల తర్వాత అభిమానులతో ముచ్చటించిన సమంత..

చాలా నెలల తర్వాత సమంత మొదటిసారిగా ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలిచ్చింది. అభిమానులు త్వరగా కోలుకోవాలి అని చెప్పడంతో అందరికి.......

Samantha : చాలా రోజుల తర్వాత అభిమానులతో ముచ్చటించిన సమంత..

Samantha chitchat with fans in twitter after a long time

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత కొన్ని నెలలుగా అందరికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. నవంబర్ లో యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సమంత ఆ సినిమాతో మంచి విజయం సాధించింది. దీంతో సమంత అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే యశోద సినిమా సమయంలోనే తాను మాయోసైటిస్ అనే వ్యాధికి గురయ్యానని, చికిత్స తీసుకుంటున్నాను అని తెలిపింది. దీంతో అభిమానులు, ప్రేక్షకులు, ప్రముఖులు సమంత త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండట్లేదు సమంత. మీడియా ముందుకి కూడా రావట్లేదు. యశోద సినిమా సమయంలో ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చింది అంతే. ఆ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తన లైఫ్ జర్నీని గుర్తు చేస్తూ ఏడ్చేసి బాగా ఎమోషనల్ అయింది. తాజాగా సోమవారం నాడు తన నెక్స్ట్ సినిమా శాకుంతలం సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Jeremy Renner : అమెరికాలో మంచు కారణంగా హాలీవుడ్ స్టార్ యాక్టర్‌కి ప్రమాదం.. ఐసీయూలో చికిత్స..

ఈ సందర్భంగా చాలా నెలల తర్వాత సమంత మొదటిసారిగా ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలిచ్చింది. అభిమానులు త్వరగా కోలుకోవాలి అని చెప్పడంతో అందరికి థ్యాంక్స్ చెప్పింది. త్వరగా కోలుకొని మరింత స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇస్తానని తెలిపింది. అలాగే తన శాకుంతలం సినిమా గురించి మాట్లాడింది. తనకి ఇలాంటి పరిస్థితుల్లో సపోర్ట్ గా నిలిచిన వాళ్లకి, తన కోసం ప్రార్ధిస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు తెలిపింది సమంత. అలాగే జీవితం గతంలో కంటే డిఫరెంట్ గా ఉందని చెప్పింది. చాలా రోజుల తర్వాత సమంత సోషల్ మీడియాలో రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ గా ఇలాగే యాక్టీవ్ గా ఉండాలని కోరుకుంటున్నారు.