Lokesh Kanagaraj : ఖైదీ 2.. సూర్య వర్సెస్ కార్తీ.. విక్రమ్ తో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు లోకేష్..
తాజాగా విక్రమ్ సినిమాలో కూడా క్లైమాక్స్ లో ఖైదీ 2 సినిమాకు లీడ్ ఇచ్చి వదిలేశాడు. దీంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఈ సీన్స్ ని చూసి షాక్ అయ్యారు. ఖైదీ సీక్వెల్లో..............
Suriya-Karthi : ఇటీవల లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఇందులో కమలహాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్యపాత్రల్లో నటించగా సూర్య గెస్ట్ రోల్ లో నటించాడు. ఇంతమంది భారీ స్టార్స్ తో విక్రమ్ గ్రాండ్ గా డిజైన్ చేసాడు లోకేష్. అయితే సినిమాలో మరో విషయంతో అందర్నీ మెప్పించాడు లోకేష్. గతంలో లోకేష్ కార్తీతో ఖైదీ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు. అయితే ఆ సినిమాకి ముందు లేదా వెనక స్టోరీ ఉంటుంది అని లీడ్ ఇచ్చి వదిలేశాడు.
తాజాగా విక్రమ్ సినిమాలో కూడా క్లైమాక్స్ లో ఖైదీ 2 సినిమాకు లీడ్ ఇచ్చి వదిలేశాడు. దీంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఈ సీన్స్ ని చూసి షాక్ అయ్యారు. ఖైదీ సీక్వెల్లో విలన్గా సూర్య, హీరోగా కార్తి నటించబోతున్నట్టు అర్ధమవుతుంది. దీంతో సూర్య, కార్తీ ఫ్యాన్స్ ఫుల్ ఆనందంలో ఉన్నారు. దానికి తోడు ఖైదీ 2లో కమల్ హాసన్ కూడా గెస్ట్ రోల్ చేయబోతున్నారు. దీంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Major Movie : అల్లు అర్జున్ కి థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఎందుకో తెలుసా??
అయితే ఖైదీ2 మొదలు పెట్టడానికి చాలా టైం ఉంది. ప్రస్తుతం సూర్య, కార్తీ ఇద్దరూ చెరో రెండు సినిమాలతో బిజీ ఉన్నాడు. లోకేష్ కూడా ప్రస్తుతం విజయ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టులు అన్ని అయ్యాక డేట్స్ చూసి ఖైదీ 2 పట్టాలెక్కుతోంది. అంటే కనీసం రెండేళ్ల పైనే పట్టొచ్చు అని సమాచారం. ఎన్ని సంవత్సరాలైనా తీసుకోండి కానీ ఈ సినిమా మాత్రం చేయండి అంటూ సూర్య కార్తీ ఫ్యాన్స్ లోకేష్ ని అడుగుతున్నారట. మొత్తానికి లోకేష్ కూడా మల్టీయూనివర్స్ సృష్టిస్తున్నాడు.