Overturn : నిర్మల్‌లో బోల్తాపడ్డ ప్రైవేటు బస్సు..17మందికి గాయాలు

నిర్మల్ జిల్లాలోని 80 మంది ప్రయాణికులతో ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17మంది గాయపడ్డారు.

Overturn :  నిర్మల్‌లో బోల్తాపడ్డ ప్రైవేటు బస్సు..17మందికి గాయాలు

Bus Overturn

bus Overturn : బయటకు వెళ్లినవారు సురక్షింతంగా తిరిగి వస్తారో లేదో తెలియటంలేదు. బస్సుల్లో ప్రయాణించేవారు ప్రాణాలతో క్షేమంగా దిగుతారో లేదో తెలికుండా ఉంది బస్సు ప్రమాదాల గురించి వింటుంటే. ఎన్నో ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంది. ఎన్నో కుటుంబాలు వేదనలకు గురవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో ఓ ప్రైవేటు బస్సు బోల్తో పడింది. ఈ ప్రమాదంలో 17మంది ప్రయాణీకులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

దీంతో నిర్మల్ జిల్లాలోని కొండాపూర్‌ బైపాస్‌ వద్ద భారీ ప్రమాదం తప్పింది. బుధవారం (నవంబర్ 3,2021) తెల్లవారుజామున 80 మంది ప్రయాణికులతో ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌ వెళ్తుండగా నిర్మల్‌ గ్రామీణ పరిధిలోని కొండాపూర్‌ బైపాస్‌ వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 15 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని నిర్మల్‌ ఏరియా ఆస్పపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. డస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండి డ్రైవ్ చేయటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణీకులు చెబుతున్నారు.