Thomas Cup 2022: పురుషుల బ్యాడ్మింటన్లో తొలి సారి గోల్డ్ సాధించిన ఇండియా
థామస్ కప్లో భారత్ ఛాంపియన్గా నిలిచింది. టైటిల్ గెలుచుకున్న ఆరో విభిన్న దేశంగా అవతరించింది. ఫైనల్లో 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను 3-0తో ఓడించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.
Thomas Cup 2022: 2022 థామస్ కప్లో భారత్ ఛాంపియన్గా నిలిచింది. టైటిల్ గెలుచుకున్న ఆరో విభిన్న దేశంగా అవతరించింది. ఫైనల్లో 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను 3-0తో ఓడించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.
థాయ్లాండ్లోని ఎరీనాలో ఆదివారం జరిగిన ఫైనల్లో హోల్డర్స్ 14 సార్లు ఛాంపియన్ ఇండోనేషియాను 3-0 తేడాతో ఓడించి భారత్ తన మొదటి థామస్ కప్ టైటిల్ను గెలుచుకుంది. అంతకుముందు, సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి భారత్ 2-0 ఆధిక్యాన్ని కొనసాగించారు.
తొలి మ్యాచ్లో ఇండోనేషియా ఆటగాడు ఆంథోనీ గింటింగ్ను ఓడించిన లక్ష్యసేన్ భారత్కు 1-0 ఆధిక్యాన్ని అందించారు. మొదటి సెట్ను 8-21తో కోల్పోయిన తర్వాత, రెండో గేమ్లో సేన్ అద్భుతంగా పునరాగమనం చేశాడు. మూడో గేమ్లో 4 పాయింట్ల లోటును కూడా అధిగమించాడు.
Read Also: ఏడుగురు బ్యాడ్మింటన్ ప్లేయర్స్కు కరోనా..టోర్నీ నుంచి అవుట్
గంటా ఐదు నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో సేన్ 8-21, 21-17, 21-16తో గింటింగ్ను ఓడించాడు. జిన్టిన్ మొదటి గేమ్ను 21-8తో చేజిక్కించుకోగా, సేన్ రెండో గేమ్లో 21-7తో గెలుపొందాడు.
సింగిల్స్ విభాగంలో హెచ్ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ జోడీ ముందంజ వేయగా, డబుల్స్లో సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ మెచ్యూరిటీని ప్రదర్శించారు. మరోవైపు మరో సెమీ ఫైనల్లో ఇండోనేషియా 3-2తో జపాన్ను ఓడించింది.