India Open 2022: ఏడుగురు బ్యాడ్మింటన్ ప్లేయర్స్‌కు క‌రోనా..టోర్నీ నుంచి అవుట్

ఏడుగురు బ్యాడ్మింటన్ ప్లేయర్స్‌కు క‌రోనా..ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీ నుంచి తప్పుకున్నారు.

India Open 2022: ఏడుగురు బ్యాడ్మింటన్ ప్లేయర్స్‌కు క‌రోనా..టోర్నీ నుంచి అవుట్

Shuttlers Covid 19 Positive

India Open 2022..7 Shuttlers Covid-19 Positive: థర్డ్ వేవ్ లో కూడా తన ప్రతాపం చూపిస్తోంది. ఈ కోవిడ్ ప్రభావం ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీపై కూడా పడింది. భారత్​కు చెందిన ఏడుగురు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కు కరోనా సోకింది. దీంతో వాళ్లు టోర్నీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్​ ఫెడరేషన్ అధికారికంగా వెల్లడించింది.

ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీ- 2022లో కొవిడ్-19 కలకలం రేపింది. భారత్​కు చెందిన ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. వీంతో వారు టోర్నీనుంచి తప్పుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్​ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్​) తెలిపింది. కిదాంబి శ్రీకాంత్​, అశ్విని పొన్నప్ప, రిథికా రాహుల్, థెరిసా జాలీ, మిథున్​ మంజునాథ్​, సిమ్రాన్ అమన్​ సింగ్​, కుషి గుప్తాలు ఉన్నారు. వీరంతా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

COVID-19 ప్రోటోకాల్‌ల ప్రకారం, పాల్గొనే ఆటగాళ్లందరికీ ప్రతిరోజూ హోటల్‌లో మరియు స్టేడియం వెలుపల పరీక్షించబడుతోంది. దీంట్లో భాగంగా ఆటగాళ్లకు మంగళవారం (జనవరి 12,2022) నిర్వహించిన ఆర్​టీ- పీసీఆర్ పరీక్షలో ఏడుగురికి పాజిటివ్​గా తేలింది. ఈ క్రమంలో పాజిటివ్ గా తేలిని ఈ ఏడుగురితో సన్నిహిత సంబంధాలున్న ఆటగాళ్లను కూడా టోర్నీ నుంచి తప్పుకున్నామని కోవిడ్ సోకిన ప్లేయర్స్​కు బదులు ఎవరినీ తీసుకోం అని..ప్రత్యర్థి ఆటగాళ్లను తదుపరి రౌండ్​కు పంపిస్తామనీ బీడబ్ల్యూఎఫ్ గురువారం (జనవరి 13,2022) తెల్లవారుజామున తెలిపింది.

ప్రపంచ బ్యాడ్మింటన్​ ఫెడరేషన్, బ్యాడ్మింటన్​ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ప్రతిరోజూ ఆటగాళ్లకు కొవిడ్​-19 టెస్టులు నిర్వహిస్తున్నారు. కాగా ఇండియా ఓపెన్ జనవరి 11న ప్రారంభమైంది. రెండవ రౌండ్ మ్యాచ్‌లు గురువారం న్యూఢిల్లీలోని KD జాదవ్ ఇండోర్ హాల్‌లో జరుగుతాయి.