India Open 2022: ఏడుగురు బ్యాడ్మింటన్ ప్లేయర్స్కు కరోనా..టోర్నీ నుంచి అవుట్
ఏడుగురు బ్యాడ్మింటన్ ప్లేయర్స్కు కరోనా..ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తప్పుకున్నారు.
India Open 2022..7 Shuttlers Covid-19 Positive: థర్డ్ వేవ్ లో కూడా తన ప్రతాపం చూపిస్తోంది. ఈ కోవిడ్ ప్రభావం ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీపై కూడా పడింది. భారత్కు చెందిన ఏడుగురు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కు కరోనా సోకింది. దీంతో వాళ్లు టోర్నీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధికారికంగా వెల్లడించింది.
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ- 2022లో కొవిడ్-19 కలకలం రేపింది. భారత్కు చెందిన ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. వీంతో వారు టోర్నీనుంచి తప్పుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) తెలిపింది. కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, రిథికా రాహుల్, థెరిసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ అమన్ సింగ్, కుషి గుప్తాలు ఉన్నారు. వీరంతా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
COVID-19 ప్రోటోకాల్ల ప్రకారం, పాల్గొనే ఆటగాళ్లందరికీ ప్రతిరోజూ హోటల్లో మరియు స్టేడియం వెలుపల పరీక్షించబడుతోంది. దీంట్లో భాగంగా ఆటగాళ్లకు మంగళవారం (జనవరి 12,2022) నిర్వహించిన ఆర్టీ- పీసీఆర్ పరీక్షలో ఏడుగురికి పాజిటివ్గా తేలింది. ఈ క్రమంలో పాజిటివ్ గా తేలిని ఈ ఏడుగురితో సన్నిహిత సంబంధాలున్న ఆటగాళ్లను కూడా టోర్నీ నుంచి తప్పుకున్నామని కోవిడ్ సోకిన ప్లేయర్స్కు బదులు ఎవరినీ తీసుకోం అని..ప్రత్యర్థి ఆటగాళ్లను తదుపరి రౌండ్కు పంపిస్తామనీ బీడబ్ల్యూఎఫ్ గురువారం (జనవరి 13,2022) తెల్లవారుజామున తెలిపింది.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ప్రతిరోజూ ఆటగాళ్లకు కొవిడ్-19 టెస్టులు నిర్వహిస్తున్నారు. కాగా ఇండియా ఓపెన్ జనవరి 11న ప్రారంభమైంది. రెండవ రౌండ్ మ్యాచ్లు గురువారం న్యూఢిల్లీలోని KD జాదవ్ ఇండోర్ హాల్లో జరుగుతాయి.
? Seven players have tested positive for COVID-19 at the #IndiaOpen2022.#BWFWorldTour https://t.co/8OBR6PJ8yH
— BWF (@bwfmedia) January 12, 2022