YS Sharmila : సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, ఒక్కొక్కరికి రూ.50వేలు ఇవ్వండి.. షర్మిల డిమాండ్

30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను అంగట్లో పెట్టావ్. నిజంగా లీకుల వెనుక మీ హస్తం లేకపోతే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. (Sharmila)

YS Sharmila : సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, ఒక్కొక్కరికి రూ.50వేలు ఇవ్వండి.. షర్మిల డిమాండ్

YS Sharmila : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. ప్రతిపక్షాలు.. అధికార బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయి. తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. విపక్ష నేతలు ఆరోపణలతో దాడికి దిగుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. కేసీఆర్ సర్కార్ పై ఫైర్ అయ్యారు.

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకులపై ఉద్యమిస్తున్న ఓయూ, కేయూ విద్యార్థులపై సర్కార్ చేపడుతున్న అణచివేత చర్యలను ఖండించారు వైఎస్ షర్మిల(YS Sharmila). విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి లాఠీఛార్జీలు, అరెస్టులు చేయడం మీ నిరంకుశ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. నోరెత్తితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారంటే మీది రౌడీల పాలన కాకపోతే మరేంటి? అని నిలదీశారు.

Also Read..TSPSC AEE Exam : రద్దైన ఏఈఈ పరీక్ష తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ

ఆనాడు మా ఉద్యోగాలు మాకే అంటూ విద్యార్థులు కొట్లాడకపోతే తెలంగాణ వచ్చేదా? అని షర్మిల ప్రశ్నించారు. వందల మంది నిరుద్యోగులు బలిదానాలు చేసుకోకపోతే రాష్ట్రం సిద్దించేదా..? అని అడిగారు. ఉద్యమ సమయంలో పోటీ పరీక్షలు రాయొద్దని విద్యార్థులను రెచ్చగొట్టి, మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అన్నారు. లీకులతో ఉద్యోగాలకు లాకులు పడ్డాయన్ని వాపోయారు.

Also Read..TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరు అరెస్టు.. ప్రశ్నాపత్రం కొనుగోలుకు రూ.10 లక్షల ఒప్పందం

30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను అంగట్లో పెట్టావ్ అని విరుచుకుపడ్డారు. నిజంగా లీకుల వెనుక మీ హస్తం లేకపోతే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు షర్మిల (YS Sharmila). పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు తక్షణ సాయంగా రూ.50 వేలు ప్రకటించాలని డిమాండ్ చేశారు షర్మిల.