Upendra : తెలుగులో మళ్ళీ బిజీ అవుతున్న ఉపేంద్ర

'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చారు ఉపేంద్ర. 2015లో ఈ సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగులో ఇప్పటివరకు ఇంకో సినిమా చేయలేదు. అయితే ప్రస్తుతం ఉపేంద్ర మళ్లీ.......

Upendra : తెలుగులో మళ్ళీ బిజీ అవుతున్న ఉపేంద్ర

Upendra

Upendra :  కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర కన్నడతో పాటు తెలుగులో కూడా అనేక సినిమాలతో ప్రేక్షకులకి దగ్గరయ్యారు. తన డిఫరెంట్ స్టైల్ సినిమాలతో ఎప్పట్నుంచో ప్రేక్షకులని అలరిస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చారు ఉపేంద్ర. 2015లో ఈ సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగులో ఇప్పటివరకు ఇంకో సినిమా చేయలేదు. అయితే ప్రస్తుతం ఉపేంద్ర మళ్లీ తెలుగు తెరపై బిజీ అవ్వనున్నారు.

ఇటీవల ఉపేంద్ర పాన్ ఇండియా స్థాయిలో హీరోగా, డైరెక్టర్ గా ‘యూ’ అనే సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా రానుంది. త్వరలో రిలీజ్ అవ్వనున్న వరుణ్‌తేజ్‌ ‘గని’ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాతో దాదాపు ఏడేళ్ల తర్వాత ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులని పలకరించనున్నారు. ఇక ఇటీవలే సెన్సేషన్ డైరెక్టర్ ఆర్జీవీతో హీరోగా ఓ సినిమాని కూడా అనౌన్స్‌ చేశారు ఉపేంద్ర. ఆర్జీవీ స్టార్ హీరోలతో సినిమాలు తీసి చాలా కాలమైంది. మరి ఉపేంద్రతో సినిమా అంటే మళ్ళీ పాత ఆర్జీవిని చూపించి తన డిఫరెంట్ స్టైల్ మేకింగ్ తో హిట్ కొడతాడేమో చూడాలి.

Rashi Khanna : రొటీన్ సినిమాలంటూ సౌత్ ఇండస్ట్రీపై రాశీఖన్నా కామెంట్స్

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవ్వనుంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా అయ్యాయి. తాజాగా మహేశ్‌ బాబు సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం త్రివిక్రమ్‌ ఉపేంద్రను సంప్రదించగా, ఆయన కూడా వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలోనే త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో ఉపేంద్ర నటించిన సంగతి తెలిసిందే. ఇలా వరుస సినిమాలతో ఉప్పీ మరోసారి తెలుగులో బిజీగా మారనున్నారు.