Noise Pollution Fine: ష్.. సౌండ్ చెయ్యొద్దు.. ఫైన్ పడిపోద్ది..
ఉత్తరాఖండ్ సీఎంగా పదవి చేపట్టినప్పటి నుంచి తీరథ్ సింగ్ రావత్ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ధ్వని కాలుష్యం నివారణ కోసం కఠిన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
Uttarakhand govt: ఉత్తరాఖండ్ సీఎంగా పదవి చేపట్టినప్పటి నుంచి తీరథ్ సింగ్ రావత్ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ధ్వని కాలుష్యం నివారణ కోసం కఠిన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇక మీదట అతిగా హారన్ మోగించే వాహనదారులపై భారీగా జరిమానాలను విధించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ ఆదేశాలు జారీ చేశారు.
మతపరమైన ప్రదేశాల్లో, పెళ్లి వేడుకల్లో, వాహనాల వల్ల శబ్ధ కాలుష్యం వెలువడితే భారీ జరిమానా విధించనున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం శబ్ధ కాలుష్య నియంత్రణ చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని, నిర్దేశిత డెసిబుల్ దాటి శబ్ధం వస్తే ఫైన్ కట్టాల్సిందేనని తెలిపారు.
కొత్తగా సూచించిన ఉత్తరాఖండ్ శబ్థ కాలుష్య నిబంధనల ప్రకారం కొన్ని ప్రాంతాలను గుర్తించారు. మతపరమైన ప్రదేశాలలో, అతిగా ధ్వని మొదటిసారిగా పేర్కొన్న డెసిబెల్ను మించితే.. జరిమానా 5 వేల రూపాయలు, రెండవసారి-10 వేల రూపాయలు, మూడోసారి 15 వేల రూపాయలు ఉంటుంది. అదేవిధంగా హోటళ్ళు, రెస్టారెంట్ల ప్రాంతాలలో మొదటిసారి 10 వేలు, రెండవసారి 15 వేలు, మూడవసారి 20 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాలలో జరిమానా 20 వేల నుంచి 40 వేల రూపాయలు వసూలు చేయనున్నట్లు తెలిపారు.
శబ్థ కాలుష్య నియమాలను ఉల్లంఘించివారిపై ప్రభుత్వం ఇకపై వెయ్యి రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు జరిమానాలు వసూలు చేయనుంది. ఉత్తరాఖండ్ పర్యావరణం, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోనుందని తెలిపారు. అదే క్రమంలో శబ్ధ కాలుష్యానికి కారణమైన పరికరాలను కూడా సీజ్ చేయనున్నట్లు తెలిపారు.