Varisu: ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకున్న వారిసు
తమిళ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సబ్జెక్ట్తో ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో విజయ్ అల్ట్రా స్టైలిష్ లుక్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా, నేడు తమిళ భాషలో రిలీజ్ అయిన ఈ సినిమాకు అన్ని చోట్లా మంచి టాక్ వస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Varisu: తమిళ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సబ్జెక్ట్తో ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో విజయ్ అల్ట్రా స్టైలిష్ లుక్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా, నేడు తమిళ భాషలో రిలీజ్ అయిన ఈ సినిమాకు అన్ని చోట్లా మంచి టాక్ వస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Varisu: మూడు రోజులు.. మూడు భాషలు.. అయోమయంలో వారిసు అభిమానులు!
ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోండగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అవ్వగానే, ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ను కూడా లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం అమెజాన్ ప్రైమ్ వారిసు చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ను భారీ రేటుకు సొంతం చేసుకుందట. ఇక వారిసు థియేట్రికల్ రన్ పూర్తవగానే ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’ టైటిల్తో జనవరి 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూస్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేయగా, థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.