Veera Simha Reddy : ఏపీలో హీట్ పుట్టిస్తున్న వీరసింహారెడ్డి పొలిటికల్ డైలాగ్స్..

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'వీరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది. ఇక ఈ మూవీ ట్రైలర్ ని నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేశారు. కాగా ఈ ట్రైలర్ లో కొన్ని పొలిటికల్ సెటైరికల్ డైలాగ్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయలో హీట్ పుట్టిస్తున్నాయి.

Veera Simha Reddy : ఏపీలో హీట్ పుట్టిస్తున్న వీరసింహారెడ్డి పొలిటికల్ డైలాగ్స్..

Veerasimha Reddy's political dialogues creating heat in AP

Veera Simha Reddy : బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది. ఒంగోలులో జరిగిన ఈ ఈవెంట్ కి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అలాగే చిత్ర యూనిట్ మొత్తం ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హాజరయ్యి సందడి చేశారు. ఇక ఈ మూవీ ట్రైలర్ ని నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేశారు. ట్రైలర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ముఖ్యంగా బాలయ్య మాస్ డైలాగ్స్ అండ్ యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి.

Veera Simha Reddy Trailer: వీరసింహారెడ్డి ట్రైలర్.. బాలయ్య మార్క్ మాస్.. ఒంటి చేత్తో ఊచకోత!

కాగా ఈ ట్రైలర్ లో కొన్ని పొలిటికల్ సెటైరికల్ డైలాగ్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయలో హీట్ పుట్టిస్తున్నాయి. సంతకాలు పెడితే ‘బోర్డ్ మీద పేరు మారుతుందోమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చినట్లు ఉంది. గతంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సమయంలో ఆ విషయం సినీ, రాజకీయంగా పెద్ద రచ్చ అయ్యింది. ఇక ఇప్పుడు బాలయ్య వేసిన డైలాగ్స్ తో మళ్ళీ ఆ విషయం చర్చలోకి వచ్చింది.

అలాగే ట్రైలర్ ఎండ్‌లో.. ‘పదవి చూసుకొని నీకు పొగరేమో, బై బర్త్ నా డిఎన్ఏ కే పొగరు ఎక్కువ’ అనే డైలాగ్ కూడా జగన్ సర్కారుపై ఇన్‌డైరెక్ట్‌గా వేసినట్లు ఉంది. ప్రస్తుతం ఈ రెండు డైలాగ్స్ ని నెటిజెన్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాని మలినేని గోపీచంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఫ్యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో విలన్ గా దునియా విజయ్ నటిస్తున్నాడు. వరలక్ష్మి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది. శృతిహాసన్, హనీ రోజ్ బాలయ్య సరసన నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.