Varisu: ‘వారిసు’ అప్డేట్‌తో గుర్రుమంటున్న విజయ్ ఫ్యాన్స్..?

తమిళ స్టార్ హీరో విజయ్ నటించే సినిమాలకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘వారిసు’ సినిమాను తెలుగులో ‘వారసుడు’ అనే పేరుతో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్‌ ప్రోమోను నిన్న చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే తెలుగు ఆడియెన్స్ మాత్రం వారిసు చిత్ర యూనిట్‌పై మండిపడుతున్నారు.

Varisu: ‘వారిసు’ అప్డేట్‌తో గుర్రుమంటున్న విజయ్ ఫ్యాన్స్..?

Vijay Fans Angry On Varisu First Single Song Update

Varisu: తమిళ స్టార్ హీరో విజయ్ నటించే సినిమాలకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘వారిసు’ సినిమాను తెలుగులో ‘వారసుడు’ అనే పేరుతో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, ఈ మూవీలో విజయ్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

Varisu: విజయ్ వారసుడు ఫస్ట్ సింగిల్ ప్రోమోకు ముహూర్తం ఫిక్స్!

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్‌ ప్రోమోను నిన్న చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. దీంతో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ కోసం వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగు ఆడియెన్స్ మాత్రం వారిసు చిత్ర యూనిట్‌పై మండిపడుతున్నారు. వారు కేవలం తమిళంలోనే ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తుండటమే వారి ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను కూడా ఒకేసారి తెలుగు, తమిళ్‌లో రిలీజ్ చేస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Varisu : ఇది పక్కా తమిళ సినిమా.. తెలుగులోకి డబ్ చేస్తున్నాం.. విజయ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన వంశీ పైడిపల్లి..

ఈ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇద్దరూ తెలుగు వారు అయినా కూడా ఇలా తమ భాషలో ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేయకుండా తొలుత తమిళంలోనే రిలీజ్ చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మరి తెలుగు ప్రేక్షకుల ఆగ్రహాన్ని వీలైనంత త్వరగా చల్లార్చే ప్రయత్నం వారిసు చిత్ర యూనిట్ చేస్తుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, అందాల భామ రష్మిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.