WPL 2023: మరో వారం రోజుల్లో డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్.. ఏ జట్లు టాప్ లో ఉన్నాయి?

విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో పాయింట్ల పట్టికలో మొదటి నుంచీ ముంబై జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికీ ఆ జట్టు స్థానం చెక్కుచెదరలేదు. డబ్ల్యూపీఎల్ మార్చి 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్ లో ఇప్పటివరకు 16 మ్యాచులు జరిగాయి. ముంబై ఇండియన్స్ 6 మ్యాచులు ఆడగా అందులో ఆ జట్టు 5 మ్యాచుల్లో గెలిచింది. దీంతో 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

WPL 2023: మరో వారం రోజుల్లో డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్.. ఏ జట్లు టాప్ లో ఉన్నాయి?

WPL 2023: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో పాయింట్ల పట్టికలో మొదటి నుంచీ ముంబై జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికీ ఆ జట్టు స్థానం చెక్కుచెదరలేదు. డబ్ల్యూపీఎల్ మార్చి 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్ లో ఇప్పటివరకు 16 మ్యాచులు జరిగాయి. ముంబై ఇండియన్స్ 6 మ్యాచులు ఆడగా అందులో ఆ జట్టు 5 మ్యాచుల్లో గెలిచింది. దీంతో 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచులు ఆడి 4 గెలిచింది. 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. యూపీ వారియర్స్ 6 మ్యాచులు ఆడి 3 మ్యాచుల్లో గెలిచింది. 6 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక, ఆర్సీబీ, గుజరాత్ జెయింట్స్ చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆర్సీబీ, గుజరాత్ జెయింట్స్ ఇప్పటివరకు మొత్తం ఏడేసి మ్యాచులు ఆడాయి. రెండు జట్లు రెండేసి మ్యాచుల్లో మాత్రమే గెలిచాయి.

దీంతో ఇరు జట్లకూ నాలుగేసి పాయింట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ జట్లలో ఓ జట్టు ఈ డబ్ల్యూపీఎల్ గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. కాగా, ఈ నెల 24న డీవై పాటిల్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచు ఈ నెల 26న ఉంటుంది.

IND-AUS Second ODI : వైజాగ్ లో భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే.. వరుణ గండంతో మ్యాచ్ నిర్వహణపై ఉత్కంఠ!