Copper : రాగిపాత్రలో నీళ్ళు తాగితే రోగాలు మాయం?

శరీరానికి అవసరం లేని వ్యర్థాలను బయటకు పంపి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. వేగంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే మంచిది.

Copper : రాగిపాత్రలో నీళ్ళు తాగితే రోగాలు మాయం?

Copper

Copper : పూర్వకాలంలో నుండి రాగి చెంబులో నీళ్ళు తాగటం చాలా మందికి అలవాటుగా వస్తుంది. అధునిక పోకడలతో ఈ అలవాటు నగర ప్రాంతాల్లో పెద్దగా కనపడకపోయినప్పటికీ నేటికి గ్రామీణ ప్రాంతాల వారు రాగి పాత్రలు, బిందెల్లో నీటిని తాగుతూనే ఉన్నారు. ఇలా రాగి చెంబులో నీరు తాగటం వల్లే వారు ఆరోగ్యంగా ఉండేవారని చెబుతుంటారు. అయితే ఇటీవలికాలంలో పట్టణప్రాంతాల్లో తిరిగి చాలా మంది అదే పద్ధతిని పాటిస్తున్నారు. దీనికి కారణం రోజురోజుకు ఎదురౌతున్న అనారోగ్యసమస్యలే. రాగి చెంబులో నీరు తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని ఉదయాన్నే తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం ఎప్పటి నుండో చెబుతోంది. శరీరానికి అవసరమైన ఖనిజాలలో రాగి ముఖ్యమైనది. ఆకుకూరలు, బీన్స్ తేన వంటి వాటిలో కాపర్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల అంతే కాపర్ శరీరానికి అందుతుంది. కానీ రాగిపాత్రలో నీటిని కనీసం 8 గంటలైనా నిల్వ ఉంచాలి.

రాగి క్యాన్సర్ సమస్యను తగ్గిస్తుంది. రాగి పాత్రలో ఉండే నీటిలో యాంటి ఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌‌‌కు దారితీసే కణాలతో పోరాడతాయి. రాగిపాత్రలో నీళ్లు తాగడం వల్ల థైరాయిడ్ సమస్య రాకుండా చూసుకోవచ్చు. అందులో ఉండే అయ్యానికత వల్ల శరీరంలో కాపర్ నిల్వలు పెరుగుతాయి. ఫలితంగా థైరాయిడ్ సమస్యను నివారించవచ్చు. థైరాయిడ్ గ్రంథి పనితీరును కూడా రాగి నీరు మెరుగుపరుస్తుంది.

రాగి పాత్రలో నీరు ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. కడుపులో ఏర్పడిన పుండ్లను నయం చేయడానికి రాగి సహాయపడుతుంది. జీర్ణక్రియ సమస్యతో బాధపడే వాళ్ళు రాగిపాత్రలో నీళ్లు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ నీళ్లు తాగడం వల్ల శరీరంలోని హానికారక బ్యాక్టీరియాలు నాశనమవుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

శరీరానికి అవసరం లేని వ్యర్థాలను బయటకు పంపి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. వేగంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే మంచిది. మెదడుకు సంకేతాలను అందించడంలో పనిచేసే న్యూరాన్లకు కవచంలా ఉపయోగపడే మైలీన్ తొడుగులు తయారు కావడానికి రాగి పాత్రలో నీరు సహాయపడుతుంది. దీనివల్ల అత్యంత వేగంగా మెదడుకు సంకేతాలు అందుతాయి. అందువల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

రాగి నీటిలో వుండే బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. నీటి ద్వారా వ్యాపించే డయేరియా, జాండీస్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. కాబట్టి రాగి పాత్రల్లో నీళ్లు తాగడం చాలా మంచిది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా రాగి పాత్రల్లో నీళ్లు అడ్డుకుంటాయి. అంతేకాకుండా కొవ్వు స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు ప్రతిరోజూ రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఈ నీటిలో వుండే కాపర్ కొవ్వు నిల్వలను తగ్గించి బరువు తగ్గేందుకు సహాయపడతాయి.

రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు బాగా ఉపయోగపడుతుంది. తద్వారా గుండె సమస్యలు కూడా తగ్గిపోతాయి. రాగి పాత్రల్లో నీళ్లు తాగడం వల్ల నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎముకలు కూడా ధృడంగా ఉంటాయి. అలాగే ఆర్థరైటిస్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి కూడా విముక్తి కలుగుతుంది. రాగి పాత్రలో నీటిని తాగేవారికి త్వరగా చర్మం యవ్వనంగా ఉండి, వృద్ధాప్య ఛాయలు రావు. చర్మ వ్యాధులు, రక్తహీనత సమస్యలు కూడా తగ్గిపోతాయట.