ప్రముఖ సినీ నటుడు కన్నుమూత

  • Published By: vamsi ,Published On : April 28, 2019 / 11:57 AM IST
ప్రముఖ సినీ నటుడు కన్నుమూత

తెలుగు సినీ, టీవీ రంగాల ద్వారా సుపరిచితులైన ప్రముఖ నటుడు పీఎస్‌సీ బోస్ ఇక లేరు.  కృష్ణవంశీ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన బోస్ తీవ్ర అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘సాహసపుత్రుడు’ సినిమాతో నటుడిగా ప్రేక్షకులకు పరిచయమైన బోస్.. హిందీలో ‘ప్రతిబంధ్‌’, చిరంజీవి ‘కొదమ సింహం’, సురేశ్‌బాబు ప్రొడక్షన్స్‌లో వచ్చిన ‘ప్రేమఖైదీ’ సినిమాలో విలన్‌గా నటించారు.

దర్శకుడు కృష్ణవంశీ తొలి సినిమా ‘గులాబి’ (1995) నుంచి ‘డేంజర్‌’ (2005) సినిమా వరకు ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ బోస్ ముఖ్యమైన పాత్రలలో నటించారు.  ఇడియట్, నిన్నే పెళ్లాడత, అల్లరి రాముడు, శివమణి వంటి సినిమాల్లోనూ.. పలు తెలుగు టీవీ సీరియళ్ళలోనూ అయన నటించారు. బోస్ మృతి పట్ల సినిమా ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.