గ్రీన్ ఇండియా ఛాలెంజ్ – మొక్కలు నాటిన శ్రీ రాపాక, సుధాకర్ చెరుకూరి..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా యువ హీరో శర్వానంద్ ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి శంషాబాద్లోని తన వ్యవసాయ క్షేత్రంలో SLV సినిమా అధినేత సుధాకర్ చెరుకూరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా SLV సినిమా సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. ‘‘రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణంలో వస్తున్న మార్పులను అరికట్టాలి అంటే మనమందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అనే ఉద్దేశంతో నేను ఈ రోజు మా వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటడం జరిగింది. వాటిని తప్పకుండా సంరక్షిస్తా’’ అని తెలిపారు. ఈ ఛాలెంజ్ కొనసాగించడం కోసం దర్శకుడు వేణు ఉడుగుల, నిర్మాతలు మైత్రి రవి, కిషోర్ గరికపాటిలను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
నటుడు కాదంబరి కిరణ్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి శ్రీ రాపాక నేడు జూబ్లీహిల్స్లోని పార్క్లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా శ్రీ రాపాక మాట్లాడుతూ.. ‘‘మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల ఈ దేశానికి మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరం. మనందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు అవసరం కాబట్టి అందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలి’’ అన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకులు రామ్ గోపాల్ వర్మ (RGV), తేజ, ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్లను ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.