Akshay Kumar: స్కూల్ నిర్మాణం కోసం రూ.కోటి విరాళమిచ్చిన అక్షయ్ కుమార్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లను కలిసేందుకు జమ్మూ అండ్ కశ్మీర్ కు వెళ్లిన అక్షయ్ కుమార్.. స్థానికంగా స్కూల్ ఏర్పాటు చేయడానికి రూ.కోటి విరాళమిచ్చారు. అక్షయ్.. బండిపొరా జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న తులైల్ గ్రామానికి గురువారం వెళ్లారు.
Akshay Kumar: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లను కలిసేందుకు జమ్మూ అండ్ కశ్మీర్ కు వెళ్లిన అక్షయ్ కుమార్.. స్థానికంగా స్కూల్ ఏర్పాటు చేయడానికి రూ.కోటి విరాళమిచ్చారు. అక్షయ్.. బండిపొరా జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న తులైల్ గ్రామానికి గురువారం వెళ్లారు.
ఫొటోలకు ఫొజులిచ్చేందుకు మాత్రమే జవాన్లను కలవలేదని నిరూపించిన అక్షయ్.. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు వందనం చేశారు. ‘సరిహద్దుల వద్ద కాపలా ఉండే ధైర్యవంతులతో ఒక గుర్తుండిపోయే రోజును గడిపాను. ఇక్కడకు వచ్చినందుకు ఓ హుందావంతమైన అనుభవం ఎదురైంది. రియల్ హీరోలను కలిసిన క్షణం గుండె నిండా గౌరవం నిండిపోయింది’ అని అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో ఇన్స్టాలో చేస్తూ పోస్టు చేశారు.
DG BSF Sh Rakesh Asthana paid floral tributes in a solemn wreath laying ceremony to Seema Praharis who made the supreme sacrifice in the line of duty. Actor Akshay Kumar also accompanied DG BSF & paid homage to the fallen braves. #JaiHind pic.twitter.com/4zu9BD1jLj
— BSF (@BSF_India) June 17, 2021
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, వాణి కపూర్, హ్యూమా ఖురేషి లీడ్ రోల్స్లో నటిస్తున్న ‘బెల్ బాటమ్’ సినిమా ఫస్ట్ ఆగస్ట్ 13 న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ సినిమాని ప్రీ పోన్ చేసి జులై 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ రెట్రో కాన్సెప్ట్ మూవీలో ‘బెల్ బాటమ్’ స్టైలిష్గా కనిపిస్తున్నారు.