‘వైకుంఠపురం’ వచ్చేస్తోందోచ్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయిలకో రూపొందిన హ్యాట్రిక్ ఫిలిం ‘అల వైకుంఠపురములో’ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ లాక్..

  • Published By: sekhar ,Published On : February 23, 2020 / 08:48 AM IST
‘వైకుంఠపురం’ వచ్చేస్తోందోచ్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయిలకో రూపొందిన హ్యాట్రిక్ ఫిలిం ‘అల వైకుంఠపురములో’ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ లాక్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..‘అల వైకుంఠపురములో’.. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కలయికలో రూపొందిన హ్యాట్రిక్ ఫిలిం ఇది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై హైయ్యెస్ట్ కలెక్షన్లతో నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది.

నివేదా పేతురాజ్, టబు, జయరామ్, మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్, సుశాంత్, సునీల్, నవదీప్ తదితరులు నటించిన ఈ చిత్రం త్వరలో 50 రోజులు పూర్తి చేసుకోబోతోంది. తాజాగా వైకుంఠపురం డిజిటల్ ప్రీమియర్ డేట్ లాక్ అయింది. సన్ నెక్స్ట్‌లో ‘అల వైకుంఠపురములో’ స్ట్రీమింగ్ కానుంది.

సన్ నెక్స్ట్‌ ఫ్యాన్సీ రేటుకి ఈ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. ఫిబ్రవరి 26 తేది నుంచి ఈ సినిమా సన్ నెక్స్ట్‌లో అందుబాటులో ఉండబోతోంది. ఆడియో, వీడియో సాంగ్స్ పరంగానూ, కలెక్షన్ల పరంగానూ రికార్డ్ క్రియేట్ చేసిన త్రివిక్రమ్ సెల్యూలాయిడ్ డిజిటల్ రంగంలో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలిమరి..

Ala Vaikunthapuramuloo Digital Premier