బాక్సాఫీస్ వద్ద వైకుంఠపురం వాయించేస్తుందిగా!

  • Published By: sekhar ,Published On : January 22, 2020 / 10:31 AM IST
బాక్సాఫీస్ వద్ద వైకుంఠపురం వాయించేస్తుందిగా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో.. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘అల… వైకుంఠపురములో’.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై పాజిటివ్ టాక్, హౌస్ ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద విజయ విహారం చేస్తోంది.

ఆరు రోజులకు రూ.104 కోట్ల షేర్ వసూలు చేయడంతో పాటు యూఎస్‌‌లో 3+మిలియన్ డాలర్ల వసూళ్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా 10 రోజుల షేర్, గ్రాస్ వివరాలు వెల్లడించారు నిర్మాతలు.

Read Also : నారప్పా.. ఎంత పని చేశావప్పా.. తెలుగు, తమిళ్ ప్రేక్షకుల మధ్య సోషల్ మీడియా ఫైట్

Image

అల వైకుంఠపురం 10 రోజులకు గానూ ప్రపంచ వ్యాప్తంగా రూ.220 గ్రాస్, 143+ కోట్ల షేర్ రాబట్టి.. నాన్ బాహుబలి రికార్డ్ సాధించినట్టుగా తెలియచేశారు. ఈ సినిమా ఓవర్సీస్‌లో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటడం విశేషం.