Allari Naresh: ఆ 20 నిమిషాలే సినిమాకు ప్రాణం!

కామెడీ హీరో నుండి కంటెంట్ ఉన్న సినిమాలు చేసే హీరోగా మారిన అల్లరి నరేశ్, గతంలో నాంది సినిమాతో ఎలాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్నాడో మనం చూశాం. నరేశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Allari Naresh: ఆ 20 నిమిషాలే సినిమాకు ప్రాణం!

Allari Naresh Says Climax Is Key For Itlu Maredumilli Prajaneekam

Allari Naresh: కామెడీ హీరో నుండి కంటెంట్ ఉన్న సినిమాలు చేసే హీరోగా మారిన అల్లరి నరేశ్, గతంలో నాంది సినిమాతో ఎలాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్నాడో మనం చూశాం. ఈ సినిమాలో అల్లరి నరేశ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, సినిమాలోని కంటెంట్ సీరియస్ నోట్‌తో ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఇప్పుడు మరోసారి సీరియస్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ అల్లరోడు.

Allari Naresh : ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను.. కానీ..

నరేశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ సినిమా రిలీజ్‌కు రెడీ కావడంతో, ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ క్రమంలో అల్లరి నరేశ్ ఈ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా ఆయనకు మంచి పేరును తీసుకొస్తుందని అల్లరి నరేశ్ అన్నాడు. కాగా ఈ సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్‌ను అద్భుతంగా చిత్రీకరించారని, ఈ సినిమా మొత్తానికి అదే ప్రాణంగా ఉంటుందని అల్లరి నరేశ్ చెప్పుకొచ్చాడు.

Allari Naresh: ‘మారేడుమిల్లి ప్రజానీకం’ వచ్చేది అప్పుడే..!

ఫైట్ మాస్టర్ పృథ్వీ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడి పనిచేశారని అల్లరి నరేశ్ పేర్కొన్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు ఏఆర్ మోహన్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన తెలిపాడు. కాగా ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ చిత్రాన్ని నవంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.