Allu Arha : అల్లు అర్హ తయారు చేసిన మట్టి గణేశుడు..
పర్యావరణానికి హాని కలుగకుండా అందరూ మట్టి వినాయకుడిని పూజించాలంటూ అల్లు అర్జున్ - స్నేహా రెడ్డిల గారాల పట్టి అల్లు అర్హ సొంతగా మట్టి గణేశుణ్ణి తయారు చేసింది..
Allu Arha: ‘బెండకాయ్, దొండకాయ్, నువ్వు నా గుండెకాయ్’ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్నేహా రెడ్డిల గారాల పట్టి అల్లు అర్హ చేసిన సందడి అంత త్వరగా మర్చిపోలేం. అర్హ చేసే అల్లరి పనులతో పాటు తన యాక్టివిటీస్ అన్నిటినీ స్నేహా రెడ్డి సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్, నెటిజన్స్తో షేర్ చేసుకుంటుంటారు.
Allu Arha : అల్లు అర్హలో ఈ టాలెంట్ కూడా ఉందా..!
వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలుగకుండా అందరూ చక్కగా మట్టి విఘ్నేశ్వరుడి విగ్రహాలను పూజించండని చెప్తూ.. తాను తయారు చేసిన మట్టి గణేశుడి బొమ్మతో ముద్దులొలుకిస్తూ అర్హ పోజు ఇవ్వగా.. ఆ క్యూట్ పిక్ని స్నేహా రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్తో పాటు ట్విట్టర్లో కూడా షేర్ చేశారు.
View this post on Instagram
చిన్నారి అర్హ తయారు చేసిన మట్టి వినాయకుడి విగ్రహం చాలా బాగుంది.. ‘లిటిల్ ప్రిన్సెస్.. ఐడియా అదుర్స్’ అంటూ బన్నీ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ అల్లు వారి వారసురాలు సమంత మెయిన్ లీడ్గా గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ హిస్టారికల్ ఫిలిం ‘శాకుంతలం’ తో బాలనటిగా అరంగేట్రం చేస్తోంది. ఇటీవలే తన పోర్షన్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసిందీ చిచ్చరపిడుగు..
— Allu Sneha Reddy (@Allusnehareddy_) September 9, 2021