Bollywod : బాలీవుడ్ ఇంకా భయపడుతోందా? ఓటీటీ వైపే బాలీవుడ్ చూపు..

బాలీవుడ్ ఇంకా భయపడుతూనే ఉంది. ఒకటి రెండు సినిమాలు తప్పించి బాక్సాఫీస్ దగ్గర సినిమాలు వర్కవుట్ అవ్వకపోవడంతో ధియేటర్లో సినిమాలు రిలీజ్ చెయ్యడానికి ఇంకా సందేహిస్తున్నారు. స్టార్ హీరోల్ని కూడా లైట్ తీసుకుంటున్న ఆడియన్స్ తో ఎందుకొచ్చిన రిస్క్ అని..............

Bollywod : బాలీవుడ్ ఇంకా భయపడుతోందా? ఓటీటీ వైపే బాలీవుడ్ చూపు..

Bollywood stars prefer ott more than theatre

Bollywod :  బాలీవుడ్ ఇంకా భయపడుతూనే ఉంది. ఒకటి రెండు సినిమాలు తప్పించి బాక్సాఫీస్ దగ్గర సినిమాలు వర్కవుట్ అవ్వకపోవడంతో ధియేటర్లో సినిమాలు రిలీజ్ చెయ్యడానికి ఇంకా సందేహిస్తున్నారు. స్టార్ హీరోల్ని కూడా లైట్ తీసుకుంటున్న ఆడియన్స్ తో ఎందుకొచ్చిన రిస్క్ అని సైలెంట్ గా సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు బాలీవుడ్ వాళ్ళు.

బాలీవుడ్ స్టార్లు ఇంకా ధియేటర్లోకి రావడానికి సంకోచిస్తున్నారు. సినిమా రిలీజ్ చేస్తే అసలు సక్సెస్ అవుతుందా? మినిమం రన్ అయినా అవుతుందా అంటూ భయపడుతున్నారు. ఎందుకంటే ఈమధ్య కాలంలో రిలీజ్ అయిన పెద్ద సినిమాలు కూడా అడ్రస్ లేకుండా పోయాయి. ఇక భూల్ భులయ్యా, దృశ్యం 2 లాంటి 100కోట్ల సినిమాలు తప్పించి మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అందుకే ధియేటర్లను తప్పించుకుని ఓటీటీల వైపు చూస్తున్నారు.

లేటెస్ట్ గా విమెన్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న తాప్సి తన ఫస్ట్ ప్రొడక్షన్ లో చేస్తున్న బ్లర్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. యురి లాంటి సాలిడ్ హిట్స్ కొట్టిన విక్కీకౌశల్ కూడా తన సినిమాని ఓటీటీలో రిలీజ్ చెయ్యడానికే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. విక్కీ, భూమి పెడ్నేకర్, కియారా లాంటి స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన గోవిందా నామ్ మేరా మూవీ డిసెంబర్ 16న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది.

భూల్ భులయ్యా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఆడియన్స్ ముందుకొచ్చినా కార్తీక్ ఆర్యన్ కి ఆడియన్స్ లో మంచి క్రేజ్, మార్కెట్ ఉన్నా కూడా తన అప్ కమింగ్ మర్డర్ మిస్టరీ సినిమా ‘ఫ్రెడ్డీ’ని డిసెంబర్ 3న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రెడీ చేస్తున్నారు. బాలీవుడ్ హ్యాపెనింగ్ స్టార్ సిద్దార్ద్ మల్హోత్రా, నేషనల్ క్రష్ రష్మిక జంటగా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను కూడా ఓటీటీనే ప్రిఫర్ చేసింది. శంతను డైరెక్షన్లో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సూపర్ కాప్ మూవీ ఆఖరికి ఓటీటీకే రాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో జనవరిలో స్ట్రీమ్ అవ్వనుంది. రేర్ గా సినమిాలు చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ చాలా కాలం తర్వాత తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా చక్ దే ఎక్స్ ప్రెస్. జులన్ గోస్వామి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ క్రికెట్ స్పోర్ట్ డ్రామా కూడా ఓటీటీలోకి వస్తుంది. ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ మూవీ త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది.

Alia-Ranbir : అలియాభట్, రణబీర్ కపూర్ కూతురి పేరేంటో తెలుసా..?

ఇలా బాలీవుడ్ బడా స్టార్స్ అంతా థియేటర్ రిస్క్ ఎందుకని ఓటీటీనే నమ్ముకుంటున్నారు. సినిమా తీసేసి ఏదో కొద్దో గొప్పో లాభానికి ఓటీటీకి సినిమాలు అమ్ముకుంటే బాలీవుడ్ పరిస్థితేంటి అని మరోసారి ఆలోచిస్తున్నారు. మరి బాలీవుడ్ కి గత వైభవం ఎప్పుడొస్తుందో చూడాలి.